కోవిడ్ టెర్రర్.. వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా భయం వీడలేదు. కనిపించని శత్రువు సవాల్ విసురుతోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ, దివ్యాంగ ఉద్యోగులకు విధులకు హాజరుకాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. వారికి ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చారు.
కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉంటున్న అధికారులు, ఇతర సిబ్బందికి కూడా మినహాయింపు ఉంటుందని జితేంద్ర సింగ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యదర్శి కంటే కిందిస్థాయి ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read
మిగతా 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తారు. కంటైన్మెంట్ జోన్ ల నుంచి ఆయా ప్రాంతాలను తొలగించేవరకూ వర్క్ ఫ్రం హోం అవకాశం వుంటుంది. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులు వివిధ అధికారిక సమావేశాలను దాదాపు వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలోనే నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ రూల్స్ జనవరి 31వరకు అమల్లో ఉండనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!