Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
- సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు
- కేంద్రమంత్రి హోదా తొలగింపు
- సంబల్పూర్ ఎంపీగా మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ధర్మేంద్ర ప్రధాన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కీలక మార్పు చేశారు. ఇప్పటివరకు తన ప్రొఫైల్లో ఉన్న ‘‘Union Minister of Education’’ అనే హోదాను తొలగించి.. దాని స్థానంలో ‘‘Member of Parliament, Sambalpur’’ (సంబల్పూర్ ఎంపీ) అని మార్చుకున్నారు.
నీట్ పేపర్ లీకేజ్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సీజేపీ నేతృత్వంలో ఢిల్లీలో ప్రారంభమైన నిరసనలు దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. పెరుగుతున్న ఒత్తిడి మధ్య శనివారం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ప్రకటిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. గత పది రోజుల పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని.. ఇది వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని అన్నారు. దేశ ఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో పాటు, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలని, విద్యార్థులు తమ చదువులు, కెరీర్పై దృష్టి పెట్టేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గౌరవనీయ ప్రధానమంత్రికి నా రాజీనామా సమర్పించాను’’ అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
Also Read
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
- Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మే 3న జరిగిన పరీక్షలో అవకతవకలు బయటపడిన తర్వాత దర్యాప్తును సీబీఐకి అప్పగించామని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
సీజేపీ స్పందన
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ.. ‘‘మేము సాధించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రజలు భయపడకుండా పోరాడితే ఎవరి రాజీనామానైనా సాధించవచ్చని ఈ పరిణామం నిరూపించింది.’’ అని వ్యాఖ్యానించారు. ఆందోళన విరమించినట్లుగా ప్రకటించారు. దీంతో జంతర్మంతర్ నుంచి విద్యార్థులు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!