Team India Players Salary: 1983లో టీమిండియా ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా..?
- 1983లో టీమిండియా ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా..?
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1983 నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతం
- కపిల్ దేవ్కు మూడు రోజుల పాటు రోజువారీ భత్యం రూ. 600
- మ్యాచ్ ఫీజు రూ. 1500.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. అయితే 39 ఏళ్ల క్రితం భారత ఆటగాళ్లు ప్రపంచకప్ గెలిచినప్పుడు వారి జీతాలు చాలా తక్కువగా ఉండేవని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1983 నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కెప్టెన్ కపిల్ దేవ్, మొహిందర్ అమర్నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, మేనేజర్ బిషన్ సింగ్ బేడీ సహా 14 మంది ఆటగాళ్ల జీతం ఎంత ఉందో చూడొచ్చు. ఆటగాళ్ళకు వారి మ్యాచ్ ఫీజుతో పాటు రోజువారీ భత్యం ఎంత ఇచ్చారో అందులో ఉంది.
Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
ఆటగాళ్లందరి జీతాలు 1983 సెప్టెంబర్ 21 యొక్క ఈ పేజీలో పేర్కొనబడ్డాయి. ఆ సమయంలో కపిల్ దేవ్కు మూడు రోజుల పాటు రోజువారీ భత్యం రూ.600 ఇచ్చారు. రోజుకు రూ.200 చొప్పున ఉండేది. మ్యాచ్ ఫీజు రూ.1500. దీని ప్రకారం మొత్తం రూ.2100. వైస్ కెప్టెన్ మొహిందర్ అమర్నాథ్ జీతం కూడా అంతే. 2100 కూడా ఇచ్చారు. వీరితో పాటు సునీల్ గవాస్కర్, కె. శ్రీకాంత్, యశ్పాల్ శర్మ, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్వీందర్ సంధు, దిలీప్ వెంగ్సాకర్, రవిశాస్త్రి, సునీల్ వాల్సన్లకు కూడా రూ.2100 అందించారు.
From earning INR 2,100 per match in 1983 to INR 125 crore prize money for winning the T20 World Cup 2024.
A testament to the rise of Indian cricket and the evolving dynamics of cricket globally.
📸: Ramiz Raja/Twitter pic.twitter.com/EuIUX3bxQG
— CricTracker (@Cricketracker) July 13, 2024
Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
1983లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్గా అవతరించినప్పుడు, ఆటగాళ్లకు చెల్లించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వద్ద డబ్బు లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ పరిస్థితి అప్పట్లో చాలా దారుణంగా ఉండేది. అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్కేపీ సాల్వే ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ అంతా డబ్బు లేకపోవడంతో ఏమీ అందించలేకపోయాడు. కాగా.. సాల్వే గాయకురాలు లతా మంగేష్కర్ సాయం కోరాడు. భారత జట్టు విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో లతా మంగేష్కర్ మ్యూజిక్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీంతో.. రూ. 20 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును భారత జట్టులోని సభ్యులందరికీ ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున బహుమతిగా అందజేశారు. కాగా.. నేడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటిగా ఉంది. బీసీసీఐ మొత్తం ఆస్తులు రూ.14,000 కోట్లకుపైగా ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు భారత ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 1983లో మొత్తం జట్టుకు కేవలం రూ.29,400 మాత్రమే చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
MAA Action: నటీనటుల అసభ్యకర వీడియోలు.. ఐదు యూట్యూబ్ ఛానల్స్ లేపేసిన ‘మా’
కాగా.. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా అందించిన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు రూ.5 కోట్లు, కోచ్లకు తలో రూ.2.5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు మరియు సెలక్టర్లకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ప్రైజ్ మనీ దక్కింది.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!