Team India Players Salary: 1983లో టీమిండియా ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా..?
- 1983లో టీమిండియా ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా..?
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1983 నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతం
- కపిల్ దేవ్కు మూడు రోజుల పాటు రోజువారీ భత్యం రూ. 600
- మ్యాచ్ ఫీజు రూ. 1500.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. అయితే 39 ఏళ్ల క్రితం భారత ఆటగాళ్లు ప్రపంచకప్ గెలిచినప్పుడు వారి జీతాలు చాలా తక్కువగా ఉండేవని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1983 నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కెప్టెన్ కపిల్ దేవ్, మొహిందర్ అమర్నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, మేనేజర్ బిషన్ సింగ్ బేడీ సహా 14 మంది ఆటగాళ్ల జీతం ఎంత ఉందో చూడొచ్చు. ఆటగాళ్ళకు వారి మ్యాచ్ ఫీజుతో పాటు రోజువారీ భత్యం ఎంత ఇచ్చారో అందులో ఉంది.
Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Also Read
ఆటగాళ్లందరి జీతాలు 1983 సెప్టెంబర్ 21 యొక్క ఈ పేజీలో పేర్కొనబడ్డాయి. ఆ సమయంలో కపిల్ దేవ్కు మూడు రోజుల పాటు రోజువారీ భత్యం రూ.600 ఇచ్చారు. రోజుకు రూ.200 చొప్పున ఉండేది. మ్యాచ్ ఫీజు రూ.1500. దీని ప్రకారం మొత్తం రూ.2100. వైస్ కెప్టెన్ మొహిందర్ అమర్నాథ్ జీతం కూడా అంతే. 2100 కూడా ఇచ్చారు. వీరితో పాటు సునీల్ గవాస్కర్, కె. శ్రీకాంత్, యశ్పాల్ శర్మ, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్వీందర్ సంధు, దిలీప్ వెంగ్సాకర్, రవిశాస్త్రి, సునీల్ వాల్సన్లకు కూడా రూ.2100 అందించారు.
From earning INR 2,100 per match in 1983 to INR 125 crore prize money for winning the T20 World Cup 2024.
A testament to the rise of Indian cricket and the evolving dynamics of cricket globally.
📸: Ramiz Raja/Twitter pic.twitter.com/EuIUX3bxQG
— CricTracker (@Cricketracker) July 13, 2024
Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
1983లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్గా అవతరించినప్పుడు, ఆటగాళ్లకు చెల్లించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వద్ద డబ్బు లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ పరిస్థితి అప్పట్లో చాలా దారుణంగా ఉండేది. అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్కేపీ సాల్వే ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ అంతా డబ్బు లేకపోవడంతో ఏమీ అందించలేకపోయాడు. కాగా.. సాల్వే గాయకురాలు లతా మంగేష్కర్ సాయం కోరాడు. భారత జట్టు విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో లతా మంగేష్కర్ మ్యూజిక్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీంతో.. రూ. 20 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును భారత జట్టులోని సభ్యులందరికీ ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున బహుమతిగా అందజేశారు. కాగా.. నేడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటిగా ఉంది. బీసీసీఐ మొత్తం ఆస్తులు రూ.14,000 కోట్లకుపైగా ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు భారత ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 1983లో మొత్తం జట్టుకు కేవలం రూ.29,400 మాత్రమే చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
MAA Action: నటీనటుల అసభ్యకర వీడియోలు.. ఐదు యూట్యూబ్ ఛానల్స్ లేపేసిన ‘మా’
కాగా.. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా అందించిన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు రూ.5 కోట్లు, కోచ్లకు తలో రూ.2.5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు మరియు సెలక్టర్లకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ప్రైజ్ మనీ దక్కింది.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!