Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
- జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలన్న కేంద్రం
- ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
- కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డ శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్
- బీజేపీకి పని లేదని.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయినా.. దానికి మళ్లీ గుర్తుచేస్తోందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే.. ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఏం జరిగిందనే విషయాలను ఈ రోజు గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ వంటి ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి పని లేదని.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయినా.. దానికి మళ్లీ గుర్తుచేస్తోందన్నారు. ప్రజలు దానిని మర్చిపోయారని.. కానీ దాని ముసుగులో కొందరు నేడు దేశంలో అరాచక పాలన సాగిస్తున్నారన్నారు.
READ MORE: DGP Dwaraka Tirumala Rao: గంజాయి, ఎర్రచందనంపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “ఎమర్జెన్సీకి మద్దతిచ్చిన వారిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బాలాసాహెబ్ ఠాక్రే కూడా ఉన్నారు. అదే బాలా సాహెబ్ ఠాక్రే ఫోటో పెట్టి ఓట్లు అడగడం లేదా? బాలాసాహెబ్ అప్పుడు ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. ఎమర్జెన్సీకి మద్దతివ్వడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు బాలాసాహెబ్ ఠాక్రే బలమైన పాత్ర పోషించారు. ఎందుకంటే ఆ సమయంలో దేశంలో క్రమశిక్షణ తీసుకురావడానికి ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు విశ్వసించారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఆ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి కూడా రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. నేడు దేశంలో కేంద్ర ప్రభుత్వ అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయి. ఇది రాజ్యాంగ హత్య కాదా? ” అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..