Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story We Are United Rahul Gandhi Meets Sharad Pawar On Opposition Unity

Rahul Meets Pawar: మేము ఐక్యంగా ఉన్నాం… ప్రతిపక్షల ఐక్యతపై వ్యూహం

NTV Telugu Twitter
Published Date :April 14, 2023 , 8:02 am
By NTV WebDesk
Rahul Meets Pawar: మేము ఐక్యంగా ఉన్నాం… ప్రతిపక్షల ఐక్యతపై వ్యూహం
  • Follow Us :
  • google news
  • dailyhunt

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ గురువారం సాయంత్రం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. ఢిల్లీలోని ఖర్గే ఇంటిలో కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడ ప్రతిపక్షాలను ఏకం చేయడానికి వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చలు జరగాలని తాను కోరుకుంటున్నానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారితో మాట్లాడాలని సూచించారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అందరినీ వెంట తీసుకుని ముందుకు సాగుతామని శరద్ పవార్ అన్నారు.
Also Read:Ambedkar Statue: సాగర తీరంలో రాజ్యాంగ నిర్మాత.. నేడు అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
శరద్ పవార్ ముంబై నుండి మమ్మల్ని సందర్శించి మాకు మార్గనిర్దేశం చేసినందుకు తాను సంతోషిస్తున్నాను అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్షాలను ఐక్యంగా తాను, రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లతో చర్చించినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతిపక్షాలను ఐక్యంగా ఉంచుతామని ఖర్గే అన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనలు.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు… ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, యువత ఉపాధికి ద్రవ్యోల్బణం వంటి అంశాలపై తాము ఒక్కటిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

విపక్షాలను ఏకం చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఖర్గే, పవార్‌ చెప్పారని రాహుల్‌ గాంధీ అన్నారు. మేమంతా ఐక్యంగా ఉన్నాం అని రాహుల్ వాఖ్యానించారు. వచ్చే ఏడాది బీజేపీని ఎదుర్కోవడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి వేదికపై జట్టుకట్టే చర్చల మధ్య బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వి యాదవ్ లు మొన్న ఖర్గే, రాహుల్ ని కలిసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. నితీష్ కుమార్ గురువారం లెఫ్ట్ అనుభవజ్ఞులైన సీతారాం ఏచూరి మరియు డి రాజాతో సమావేశమైనందున, ఈ వారంలో ప్రతిపక్ష ఐక్యతను సుస్థిరం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
Also Read: Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..
రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉన్నందున నాయకులు ఐక్యత చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. త్వరలో ప్రతిపక్షాల అగ్రనేతల సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలతో సమావేశమైన తర్వాత బిహా సీఎం నితీష్ కుమార్ దేశ రాజధానిని విడిచిపెట్టారు.

आज सरकारी संस्थाओं का दुरुपयोग हो रहा है, युवाओं के पास रोजगार नहीं है, महंगाई लगातार बढ़ रही है और बोलने की आजादी छीनी जा रही है।

ऐसे में हमने लोकतंत्र की रक्षा करने के साथ ही देश को बचाने के लिए एक होकर आगे बढ़ने का निर्णय लिया है।

: कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/xZSgfyWwsU

— Congress (@INCIndia) April 13, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Mallikarjun Kharge
  • NCP
  • opposition
  • rahul gandhi

తాజావార్తలు

  • CM Chandrababu and Kishan Reddy: చంద్రబాబుతో కిషన్‌రెడ్డి లంచ్‌ మీటింగ్.. తాజా రాజకీయాలపై చర్చ

  • MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు!

  • Austria school shooting: ఆస్ట్రియా స్కూల్‌లో ఉన్మాది కాల్పులు.. 8 మంది మృతి..

  • Kannappa : మంచు విష్ణు ఓవర్ హైప్.. బెడిసికొడుతుందా..?

  • US Embassy: “అలాంటి వారు అమెరికాకు వచ్చే హక్కు లేదు”.. భారతీయ విద్యార్థికి సంకెళ్లపై వివరణ..

ట్రెండింగ్‌

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions