పంజాబ్ ఫైట్: ముఖ్యమంత్రుల మధ్య పెరిగిన మాటల యుద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉండటంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఎలాగైనా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచిత విద్యుత్ హామీని ప్రకటించింది. ఢిల్లీలో సమర్థవంతంగా ఈ హామీ అమలవుతున్నప్పుడు పంజాబ్లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమలుకాదని ఆప్ ప్రశ్నిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, పంజాబ్ ముఖ్యమంత్రి చన్ని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీ దగ్గర 5 వేలు ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రావాల్ కు ఇవ్వాలని, ఆయన ఆ డబ్బుతో మంచి బట్టలు కుట్టించుకుంటారని అన్నారు. ఆయన జీతం రూ.2.5 లక్షలు అని, మంచి బట్టలు కుట్టించుకోలేరా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ట్విట్టర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ రిప్లై ఇచ్చారు. చన్నీకి తన దుస్తులు నచ్చకపోయినా, ప్రజలకు నచ్చుతాయని, ఆ విషయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఉద్యోగికీ ఉపాది, రైతుల రుణాలు మాఫీ, మతం పేరుతో అల్లర్లకు పాల్పడే వారిని జైలుకు పంపడం, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం వంటివి ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.
Read: ఆ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత… మార్గదర్శకాలు ఇవే…
Also Read
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!