Amritpal Singh: లోక్సభ వేదికగా ఖలిస్తానీ మద్దతుదారు, ఎంపీ అమృత్పాల్ సింగ్కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మద్దతు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఖలిస్తాన్కి మద్దతు ఇస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అమృత్పాల్ని జాతీయ భద్రతా చట్టాల కింద అరెస్ట్ చేశారు.
Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారుడు, ఎంపీ అమృత్పాల్ సింగ్కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ మద్దతు తెలిపారు. లోక్సభలో ఆయన అమృత్పాల్ సింగ్కి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశం ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ని ఎదుర్కొంటోందని చన్నీ అన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. పంజాబ్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి.. మరోసారి పంజాబ్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు ముందే.. సీఎం అభ్యర్థిని ప్రకటించారు రాహుల్ గాంధీ.. ప్రస్తుతీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపేరునే మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీప్గా ఉన్న నవజ్యోత్సింగ్ సిద్ధూకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు బహిరంగంగా అంతా బాగానే…
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ సీఎం అభ్యర్థిని లుథియానా వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థి అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.…
పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే కొనసాగుతూ వచ్చాయి.. సీఎంగా ఉన్న ఓ సీనియర్ నేత పార్టీకి గుడ్బై చెప్పి వెళ్లిపోయారు.. ఇక, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. సీఎం ఓవైపు, పీసీసీ చీఫ్ మరోవైపు.. తమకు తోచినట్టు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ…
సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్ఎఫ్కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్ఎఫ్కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్…
పంజాబ్లో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉండటంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఎలాగైనా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచిత విద్యుత్ హామీని ప్రకటించింది. ఢిల్లీలో సమర్థవంతంగా ఈ హామీ అమలవుతున్నప్పుడు పంజాబ్లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమలుకాదని ఆప్ ప్రశ్నిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, పంజాబ్…
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి చిక్కులు తప్పడంలేదు. ఓవైపు సొంత పార్టీనుంచి మరోవైపు విపక్షాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి. కొత్తగా నియమించిన డీజీపీ, అడ్వొకేట్ జనరల్ లను తొలగించాల్సిందేనని సిద్ధూ పట్టుబడుతుండగా, ఉన్నతస్థాయి సమావేశానికి సీఎం కొడుకు హాజరవడంపై విపక్షాలు విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ను ఏదో ఒకటి చేసేవరకు సిద్ధూ విశ్రమించేలా లేడు. కోరి ముఖ్యమంత్రి చేసిన చరణ్ జిత్ సింగ్ చన్నీతో అప్పుడే గొడవకు దిగాడు. డీజీపీ, అడ్వొకేట్ జనరల్…
పంజాబ్ పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేసిన తరువాత పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిద్ధూ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మంత్రులు కోరినా ఆయన వినలేదు. రాజీనామాపై పునరాలోచన లేదని అన్నారు. తన తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాటం చేస్తానని సిద్ధూ పేర్కొన్నారు. అవినీతి మరకలు అంటిన వ్యక్తులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత విషయాల కోసం జరిగే యుద్ధం కాదని, సిద్ధాంతాల కోసం జరుగుతున్న యుద్ధం అని, అవినీతి మరకలు…
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. ఇందులో భాగంగా సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ను పక్కకు తప్పించి ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నికి అవకాశం ఇచ్చింది. దీంతో పంజాబ్లో సంక్షోభానికి తెరపడినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే, సడెన్గా పంజాబ్ పీసీసీకి సిద్ధూ రాజీనామా చేశారు. ఆయనకు మద్ధతుగా ఓ మంత్రి, ఓ నేత…