Varanasi court: అఖిలేష్, ఒవైసీలకు షాక్.. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు వారణాసి కోర్టు నోటీసులు చేసింది. న్యాయవాది హరిశంకర్ పాండే దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై అదనపు జిల్లా న్యాయమూర్తి అనురాధ కుష్వాహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
Also Read: Saudi Arabia: ఘోర బస్సు ప్రమాదం… 20 మంది యాత్రికులు దుర్మరణం
జ్ఞాన్వాపి మసీదు కాంపౌండ్లో దొరికిన ‘శివలింగం’పై ఆరోపించిన వ్యాఖ్యలకు, సందర్శకులచే దాని అబ్లూషన్ చెరువును మురికి చేశారని ఆరోపించినందుకు SP చీఫ్ అఖిలేష్ యాదవ్, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇతరులపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఫిబ్రవరి 15న అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉజ్వల్ ఉపాధ్యాయ తన అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత, తాను జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ను దాఖలు చేసానని హరిశంకర్ పాండే అన్నారు. జిల్లా న్యాయమూర్తి కోర్టు నుండి ADJ-IX కోర్టుకు బదిలీ చేయబడింది. రివిజన్ పిటిషన్పై విచారణ ప్రక్రియను ప్రారంభించిన కోర్టు.. ప్రతివాదులందరికీ నోటీసులు అందజేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 14కి వాయిదా వేసింది.
Also Read:Hidden treasures: రాజేంద్రనగర్ లో గుప్త నిధుల తవ్వకాలు.. ఎంట్రీ ఇచ్చిన ఎస్వోటీ
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
గతంలో విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా వేడి పెరిగింది. ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. “ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు. ఈ దేశానికి ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు లేదు.. ఉండదు… మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే భారత పార్లమెంట్లో ఇంత తక్కువ ముస్లిం ప్రాతినిధ్యం ఎందుకు ఉంది..? బాబ్రీ మసీదుకు బదులు అప్పుడు మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే… ఇప్పుడు జ్ఞానవాపి సమస్య తెరపైకి ఎందుకు వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!