త్వరలో వకుళా మాత ఆలయం ప్రారంభం.. మంత్రి పెద్దిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాల నాటి భక్తుల కల త్వరలో నెరవేరబోతోంది. ఏళ్ళ తరబడి శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయం శరవేగంగా పునర్నిర్మాణమవుతోంది.తిరుపతిలోని వకుళామత దేవాలయం పనులని పరిశీలించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. త్వరలో జరిగే వకుళామత దేవాలయం ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని మంత్రి అన్నారు. భారీ వర్షాల కారణంగా పేరూరు చెరువులో నీరు నిండి పనులు ఆగాయన్నారు. ఇప్పుడే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, కోనేరు పని పూర్తి చేసి, గార్డెనింగ్ తో పాటు మిగిలిన పరిసరాలు సుందరికరిస్తాం అన్నారు. ఇప్పటికే దేవాలయంలో పనులు అన్నీ పూర్తి చేశామన్నారు. కోనేరు, మిగిలిన పనులు పూర్తయ్యాక దేవాలయం భక్తులకి అందుబాటులోకి తెస్తాం అన్నారు. తిరుమలకు అన్నమయ్య మూడో మార్గం అవసరం ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఎన్ని దారులైనా శ్రీవారి చెంతకు మాత్రమే చేరుతాయి అన్నారు.
వకుళామాత ఆలయానికి మంచి రోజులు
తిరుపతి రూరల్ పాతకాల్వ సమీపంలోని పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయం వందేళ్లకు పైగా చరిత్ర కలిగి వుంది. తర్వాత ఆలయం వున్న సంగతి ఎవరికీ తెలీదు. పేరూరు బండపై కాశిరాళ్లతో శిథిలమైన ఓ ఆలయం దర్శనమిచ్చేది. విగ్రహం ధ్వంసం కావడంతో దీన్ని తీసుకెళ్లి కాలువలో పడేశారని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలోని వకుళామాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి గంట మోగించిన తర్వాతే తిరుమలలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యం సమర్పించేవారు. అంతటి విశిష్టత వున్న ఆలయం ఏళ్ళ తరబడి జీర్ణోద్ధరణకు నోచుకోలేదు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
2010లో కొందరు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయాన్ని పునఃనిర్మించాలని 2015లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆలయానికి 4.5 ఎకరాలు కేటాయిస్తూ బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. టీటీడీకి ఆ స్థలాన్ని అప్పగించారు. ఇనుప కంచె ఏర్పాటుచేశారు. 2017లో పరిపూర్ణానంద స్వామి ద్వారా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ తీసుకుని ఆలయ పనులు వేగవంతం చేశారు.పూర్వపు ఆలయ నిర్మాణాన్ని కదపలేదు. పురాతన రాతికట్టడం మీదనే నిర్మాణం పూర్తిచేశారు. ఆలయం ముఖద్వారం వద్ద గాలిగోపురం వుంది. గర్భగుడికి శిఖరం ఏర్పాటు చేసి, రాగితాపడం పనులు పూర్తిచేశారు. రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం పూర్తయి ప్రారంభమైతే పరిసర ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!