టీమిండియా ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 కెప్టెన్గా ముంబైకి చెందిన రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు. భారత జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ టీ20లకు ఉన్నట్టుండి రాజీనామా ప్రకటించడం.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం బాగోలేదని చెప్పడానికి నిదర్శనమన్నాడు. ప్రస్తుతానికి టీమిండియాలో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయని.. అందులో ఒకటి ఢిల్లీ గ్రూప్.. రెండోది ముంబై గ్రూప్ అని వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులు చూస్తుంటే కోహ్లీ త్వరలోనే అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతాడని అనిపిస్తోందని తెలిపాడు.
Read Also: న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక
Also Read
మరోవైపు టీ20 ప్రపంచకప్లో భారత్ ఓటమికి ఐపీఎల్ కారణమని ముస్తాక్ అహ్మద్ ఆరోపణలు చేశాడు. ప్రపంచకప్ లాంటి టోర్నీకి ముందు సుదీర్ఘకాలం బయోబబుల్లో ఉండటం టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసిందని తెలిపాడు. దీంతో ఆటగాళ్లు అలసట చెందారని.. ప్రణాళికల ప్రకారం ఆడలేకపోయారని పేర్కొన్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్లో భారత్ ఓటమికి ఐపీఎల్ టోర్నీనే కారణమని, ఆటగాళ్లు కూడా మనుషులేనని… సుదీర్ఘకాలం బయోబబుల్లో ఉండటం సాధారణ విషయం కాదన్నాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!