ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు తుడుందెబ్బ పిలుపు నిచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన 317 జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది తుడుం దెబ్బ. ఉదయం నుంచే ఆదిలాబాద్ బస్టాండ్ ముందు ఆదివాసి హక్కుల పోరాట సమితి ధర్నా చేయడంతో బస్సులు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ నంబర్ 3 ప్రకారం నియమితులైన ఉద్యోగులనే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా తుడుం దెబ్బ నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నారు.
ఉపాధ్యాయ, ఉద్యోగులను 317 జీవోతో స్థానికత పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలను చేపడుతోంది ప్రభుత్వం. దీంతో చాలా మంది జూనియర్ ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గిరిజనులు ఈ జీవోపై మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జీవో రద్దుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.