ఈనెల 27న సీఎం కేసీఆర్ సభపై డైలమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచార పోరు నడుస్తోంది. ఉప ఎన్నికకు సమయం ముంచుకువస్తుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అధినేత కేసీఆర్తో సభలు నిర్వహించేలా ప్రణాళికలు రచించింది. ఈనెల 27న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు వీలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే హుజురాబాద్కు పక్కనే పెంచికల్ పేట ఉంటుంది.
Read Also: ఉప ఎన్నికలు జరిగే జిల్లా అంతటా కోడ్ అమలు: కేంద్ర ఎన్నికల సంఘం
Also Read
అయితే గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గైడ్లైన్స్ రూపొందించింది. ఉపఎన్నికలు జరుగుతున్న జిల్లాలో లేదా నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కూడా ఉప ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను నిర్వహించవద్దని సీఈసీ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. దీంతో ఈనెల 27న పెంచికల్ పేటలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించడంపై టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడిందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!