గుప్తనిధుల తవ్వకాలు అనంతం.. చారిత్రక ఆనవాళ్ళు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు.. పురాతన కట్టడాలను, చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కట్టడాలు కింద.. నిధులు ఉన్నాయన్న నమ్మకంతో వాటిని సర్వ నాశనం చేస్తున్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన అనంతలో చారిత్రక సంపద ధ్వంసమవుతోంది. చివరికి లేపాక్షి క్షేత్రాన్ని కూడా వదలకుండా ధ్వంసం చేస్తుంటే, అధికార యంత్రాంగం ఏం చేస్తోందని పురావస్తు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
అనంతపురం జిల్లా పేరుకి కరువు ప్రాంతమైనప్పటికీ.. గతంలో రాజులు పాలించిన ఒక చారిత్రక ప్రదేశం. జిల్లావ్యాప్తంగా ఇందుకు సజీవ సాక్ష్యంగా ఎన్నో కట్టడాలు మనకి కనిపిస్తాయి. ఇందులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లేపాక్షి, విజయనగర రాజులు పాలించిన పెనుకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువగా చారిత్రిక కట్టడాలు కనిపిస్తాయి. వీటికీ తోడు వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలు కూడా చాలా ఉన్నాయి.
Also Read
అయితే వీటి సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం శాపంగా మారింది.. ఇప్పటికే చాలా కట్టడాలు కనుమరుగయ్యాయి. మరి కొన్నింటిని కొందరు స్వార్థపరులు గుప్తనిధుల కోసం నిలువునా ధ్వంసం చేస్తున్నారు. ఇందులో పెనుకొండ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ పదుల సంఖ్యలో ఆలయాలు ఇప్పటికే కనిపించకుండా పోయాయి. అయితే ఇప్పుడు వేటగాళ్ల దృష్టి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలపై పడింది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికే చాలావరకు ఆక్రమణకు గురైంది. తాజాగా గుప్తనిధుల వేటగాళ్లు.. ఉన్న ఆలయాన్ని కూడా ధ్వంసం చేసే సాహసం చేస్తున్నారు.
విజయనగర రాజుల కాలంలో ప్రముఖ వాణిజ్య పట్టణంగా పేరొందిన లేపాక్షి కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. కల్యాణ గోపురంలో స్థానికుల సహకారంతో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు కోసం లేపాక్షి రేస్ లో ఉంది. ఇలాంటి సమయంలో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నా రంటే.. అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి లేపాక్షి ఆలయ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ప్రస్తుతం లేపాక్షి క్షేత్రానికి ప్రపంచ పర్యాటక పటంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఈ ఘటన వెనక ఎవరో ఉన్నారన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, మరెప్పుడు గుప్తనిధుల తవ్వకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే.
తాజావార్తలు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..