మత్తులో తెలుగు రాష్ట్రాలు.. చిత్తవుతున్న యువత జీవితాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రోజురోజు అత్యాధునిక సాంకేతికతతో ప్రంపచం ముందు వెళుతోంది. కానీ.. కొంతమంది యువత మాత్రం మత్తులో చిత్తవుతూ.. వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ఎక్కడ తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి బయటపడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లను నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో సైతం మాదకద్రవ్యాల వాడకం బయట పడుతూనే ఉంది. ఇటీవల మొయినాబాద్లోని ఓ రిసార్ట్లో అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
దీంతో ఈ పుట్టినరోజు పార్టీలో సుమారు 30 మంది యువతీయువకులు గంజాయి మత్తులో దొరికనట్లు తెలుస్తోంది. యువతకు సరైన గైడెన్స్లేక మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తమ పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపడం వల్ల వారి ఆలవాట్లపై ఓ అంచనా వస్తుందని, ఎక్కువగా పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువు, ఇతరాత్ర విషయాల్లో ఒత్తిడికి లోనైనప్పుడే యువత చెడు మార్గాలు ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయంలో తల్లిదండ్రులు మార్గదర్శులుగా ఉండాలని ఆధ్యాయనాలు చెబుతున్నాయి.
Also Read
యువత గంజాయి, డ్రగ్స్ లాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించక తప్పదు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ స్మగ్లర్లు కూడా మాదకద్రవ్యాల రవాణాలో కొంత పంథాను ఎంచుకుంటున్నారు. అసాంఘీక కార్యకలాపాలు కనబడినా, ఎవరిపైనా అనుమానం వచ్చిన సమాచారం అందిచాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!