మత్తులో తెలుగు రాష్ట్రాలు.. చిత్తవుతున్న యువత జీవితాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రోజురోజు అత్యాధునిక సాంకేతికతతో ప్రంపచం ముందు వెళుతోంది. కానీ.. కొంతమంది యువత మాత్రం మత్తులో చిత్తవుతూ.. వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ఎక్కడ తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి బయటపడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లను నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో సైతం మాదకద్రవ్యాల వాడకం బయట పడుతూనే ఉంది. ఇటీవల మొయినాబాద్లోని ఓ రిసార్ట్లో అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
దీంతో ఈ పుట్టినరోజు పార్టీలో సుమారు 30 మంది యువతీయువకులు గంజాయి మత్తులో దొరికనట్లు తెలుస్తోంది. యువతకు సరైన గైడెన్స్లేక మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తమ పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపడం వల్ల వారి ఆలవాట్లపై ఓ అంచనా వస్తుందని, ఎక్కువగా పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువు, ఇతరాత్ర విషయాల్లో ఒత్తిడికి లోనైనప్పుడే యువత చెడు మార్గాలు ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయంలో తల్లిదండ్రులు మార్గదర్శులుగా ఉండాలని ఆధ్యాయనాలు చెబుతున్నాయి.
Also Read
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
యువత గంజాయి, డ్రగ్స్ లాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించక తప్పదు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ స్మగ్లర్లు కూడా మాదకద్రవ్యాల రవాణాలో కొంత పంథాను ఎంచుకుంటున్నారు. అసాంఘీక కార్యకలాపాలు కనబడినా, ఎవరిపైనా అనుమానం వచ్చిన సమాచారం అందిచాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!