తాగి వాహనాలు నడిపితే పబ్లదే బాధ్యత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగి వాహనం నడిపితే పబ్లదే బాధ్యత అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. ఇళ్ల మధ్య పబ్ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, పబ్లో నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేసింది హైకోర్టు.. పబ్ల ముందు ఖచ్చితంగా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని.. తాగి వాహనాలను నడపవద్దు అంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిని విచారిస్తామని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక, తాగిన వారికి డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్న కోర్టు.. డీజే సౌండ్లో పై 45 డెసిబల్స్ మించకుండా చూడాలని.. ఈ నిబంధనలు జనవరి 3వ తేదీ అర్థరాత్రి వరకు అమలు చేయాలని స్పష్టం చేసింది.
Read Also: శ్రీవారి ఆలయంలో జనవరిలో విశేష ఉత్సవాలు.. ఏ రోజు ఏంటి..?
Also Read
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
- Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
- Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
ఇక, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పోలీసు శాఖ తరుపు న్యాయవాది కోరగా.. హైకోర్టు ఒప్పుకుంది.. ఎక్సైజ్ శాఖను ప్రతివాదులుగా చేర్చాలని తెలిపింది.. మరోవైపు, మైనర్లను పబ్లలోపలికి అనుమతించవద్దు అని స్పష్టం చేసింది హైకోర్టు.. పేరెంట్స్ తో పాటు వచ్చిన మైనర్లను కూడా అనుమతించొద్దు అని సూచించింది.. వేడుకలపై హైకోర్టు ఆదేశాలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు పరుస్తూ పోలీస్ గైడ్ లైన్స్ ను పాటించాలని సూచించింది.. తదుపరి విచారణలో హైకోర్టుకు అందే నివేదికల ఆధారంగా విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో.. హైదరాబాద్ పోలీసులు ఊహించిన దాని కంటే ఎక్కువగానే చర్యలు తీసుకున్నట్లు అభిప్రాయపడింది హైకోర్టు.. పబ్ల ముందు హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశిస్తూనే.. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యతని స్పష్టం చేసింది.. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 6వ తేదీన జరగనుంది.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
CM Vijay: IMDb లిస్ట్ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
-
Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!