Hyderabad: హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్లోని యువత మత్తులో జోగుతున్నారు.
Hyderabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్లోని పబ్బులు గబ్బుకు కేరాఫ్ అడ్రస్గా మారాయా?.. న్యూసెన్స్కు మించి పబ్బుల్లో గలీజ్ పనులు జరుగుతున్నాయా?.. కొంత మంది యువతులను ఎరగా వేసి కస్టమర్లను నిలువునా దోచేస్తున్నాయా?.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని పబ్బులు నగరాన్ని గబ్బు పట్టిస్తు్న్నాయి. రూల్స్ను కూడా పట్టించుకోకుండా పబ్బుల్లో గలీజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల పబ్బుల ఆగడాలు శృతి మించుతున్నాయి.
హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు హోటల్స్ల లైసెన్స్లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసి పర్మిషన్లను మాదాపూర్ పోలీసులు చెక్ చేశారు.
దరాబాద్ లోని పలు పబ్స్, క్లబ్స్ పై ఇప్పటికే పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ వినియోగం పబ్స్ లోనే అత్యధికంగా ఉంది.. ఈ డ్రగ్స్ అమ్మకాలకు అడ్డాలుగా మారిన పబ్స్ లో బడా బాబుల పిల్లలే టార్గెట్ గా పోలీసులు దృష్టి సారించారు. గోవా, బెంగళూర్, ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను పెడ్లెర్స్ దిగుమతి చేస్తున్నారు.
నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన చేసేది విలన్ క్యారెక్టర్స్ అయినా మనసు మాత్రం ఎంతో మంచిది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో సోనూసూద్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఎందరికో సహాయం అందించి మన్ననలు అందుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా అడుగు ముందుకేసి చేసేస్తుంటాడు. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలిక…
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు నియమాలను పాటించని పబ్ లు ఆజ్యం పోస్తున్నాయని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆగ్రం వ్యక్తం చేశారు. తెలంగాణ NSUI బృందం శంషాబాద్ ఎయిరో ప్లాజా కాంప్లెక్స్ లోని సిప్ ఆఫ్ స్కై,చికెన్ వైల్డ్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్ ల వద్దకు తనిఖీ కోసం వెళ్లారు. అర్థరాత్రి 12 గంటలకు మూసెయ్యాల్సిన పబ్ లు ఉదయం 3 గంటలకు కూడా ఇంకా నడుస్తూనే ఉండడంతో అక్కడి పబ్ నిర్వాహకులపై…
నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్ ఉన్న హోటల్కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్కు అపఖ్యాతి తీసుకురావద్దని…
హైదరాబాద్ హైటెక్ నగరమే కాదు డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగానికి అడ్డాగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. తాజాగా బంజారాహిల్స్ లో రాడిసన్ హోటల్లోని ఫుడిండ్ అండ్ మింక్ పబ్ లో ప్రముఖుల పిల్లలు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో దొరికిపోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ పబ్ లో డ్రగ్స్ గబ్బు రేపుతున్నాయి. ఇప్పటివరకూ పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతుందని వినడమే ఈసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు మత్తుగాళ్లు. మొన్న హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తొలి మరణం…
హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో పబ్బు యాజమానులతో ఆయన సమావేశం అయి డ్రగ్స్, మత్తు పదార్థాలను నిరోధించడానికి వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఏడేళ్లుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. హైదరాబాద్ అంటేనే భరోసా అని చెప్పారు. ఒడిశా ఏపీలలో గంజాయి సాగు ఎక్కువగా చేస్తున్నారు. అక్కడి నుండి గంజాయి కొని…