Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Belagavi Honeytrap: సోషల్ మీడియాను వినోదం కోసం కాకుండా.. విలాసవంతమైన జీవితం కోసం మోసాలకు సాధనంగా మార్చుకున్న ఓ కిలాడీ లేడీ ఉదంతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఇన్స్టాగ్రామ్లో అందమైన ఫోటోలతో ఎర వేసి, ధనవంతులను లాడ్జీలకు పిలిపించి, అందినకాడికి దోచుకుంటున్న ‘హనీట్రాప్’ ముఠా గుట్టును తిలక్వాడి పోలీసులు రట్టు చేశారు. బాగల్కోట్ జిల్లా మహాలింగపూర్కు చెందిన దీపా అవతగి (33) వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఈమె ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ధనవంతుల ప్రొఫైల్స్ను టార్గెట్ చేసేది. ముందుగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి, ఆపై తియ్యని మాటలతో వారి నమ్మకాన్ని సంపాదించుకునేది. వారితో పరిచయం కాస్త ముదిరిన తర్వాత ఏకాంతంగా కలుద్దామంటూ హోటళ్లు లేదా లాడ్జీలకు ఆహ్వానించేది.
READ ALSO: Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..
Also Read
- El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
- Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
స్కెచ్ అదిరిపోయింది కానీ..
బాధితులు ఆమెను నమ్మి లాడ్జీకి రాగానే అసలు కథ మొదలయ్యేది. మాటల్లో దించి బాధితులను స్నానం చేయమనో లేదా ఫ్రెష్ అవ్వమనో బాత్రూంకు పంపేది. వారు లోపలికి వెళ్లగానే గదిలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, చివరకు వారి కారు తాళాలు కూడా తీసుకుని అక్కడి నుంచి మెరుపు వేగంతో పారిపోయేది. దోచుకున్న వస్తువులతో ఆగకుండా, బాధితులకు ఫోన్ చేసి అసలు వేధింపులు మొదలుపెట్టేది. “డబ్బు ఇస్తేనే నీ కారు, వస్తువులు తిరిగి ఇస్తా.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తా” అని బెదిరించేది. సమాజంలో పరువు పోతుందన్న భయంతో చాలా మంది ఆమె అడిగినంత ఇచ్చుకున్నారు. అయితే, ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కిలాడీ లేడీ నెట్వర్క్ బయటపడింది.
పోలీసుల యాక్షన్..
తిలక్వాడి పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో దీపను అరెస్టు చేశారు. విచారణలో ఆమె అనేక సంచలన విషయాలు వెల్లడించింది. ఈ దోపిడీల్లో ఆమెకు హుక్కేరికి చెందిన శివానంద్ మతపతి అనే వ్యక్తి సహకరిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇప్పటివరకు ఈమె చేతిలో ఎంత మంది మోసపోయారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు, ముఖ్యంగా ఏకాంతంగా కలవమన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!
తాజావార్తలు
-
Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
-
El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
-
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
-
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!