Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Belagavi Honeytrap: సోషల్ మీడియాను వినోదం కోసం కాకుండా.. విలాసవంతమైన జీవితం కోసం మోసాలకు సాధనంగా మార్చుకున్న ఓ కిలాడీ లేడీ ఉదంతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఇన్స్టాగ్రామ్లో అందమైన ఫోటోలతో ఎర వేసి, ధనవంతులను లాడ్జీలకు పిలిపించి, అందినకాడికి దోచుకుంటున్న ‘హనీట్రాప్’ ముఠా గుట్టును తిలక్వాడి పోలీసులు రట్టు చేశారు. బాగల్కోట్ జిల్లా మహాలింగపూర్కు చెందిన దీపా అవతగి (33) వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఈమె ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ధనవంతుల ప్రొఫైల్స్ను టార్గెట్ చేసేది. ముందుగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి, ఆపై తియ్యని మాటలతో వారి నమ్మకాన్ని సంపాదించుకునేది. వారితో పరిచయం కాస్త ముదిరిన తర్వాత ఏకాంతంగా కలుద్దామంటూ హోటళ్లు లేదా లాడ్జీలకు ఆహ్వానించేది.
READ ALSO: Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..
Also Read
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
స్కెచ్ అదిరిపోయింది కానీ..
బాధితులు ఆమెను నమ్మి లాడ్జీకి రాగానే అసలు కథ మొదలయ్యేది. మాటల్లో దించి బాధితులను స్నానం చేయమనో లేదా ఫ్రెష్ అవ్వమనో బాత్రూంకు పంపేది. వారు లోపలికి వెళ్లగానే గదిలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, చివరకు వారి కారు తాళాలు కూడా తీసుకుని అక్కడి నుంచి మెరుపు వేగంతో పారిపోయేది. దోచుకున్న వస్తువులతో ఆగకుండా, బాధితులకు ఫోన్ చేసి అసలు వేధింపులు మొదలుపెట్టేది. “డబ్బు ఇస్తేనే నీ కారు, వస్తువులు తిరిగి ఇస్తా.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తా” అని బెదిరించేది. సమాజంలో పరువు పోతుందన్న భయంతో చాలా మంది ఆమె అడిగినంత ఇచ్చుకున్నారు. అయితే, ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కిలాడీ లేడీ నెట్వర్క్ బయటపడింది.
పోలీసుల యాక్షన్..
తిలక్వాడి పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో దీపను అరెస్టు చేశారు. విచారణలో ఆమె అనేక సంచలన విషయాలు వెల్లడించింది. ఈ దోపిడీల్లో ఆమెకు హుక్కేరికి చెందిన శివానంద్ మతపతి అనే వ్యక్తి సహకరిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇప్పటివరకు ఈమె చేతిలో ఎంత మంది మోసపోయారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు, ముఖ్యంగా ఏకాంతంగా కలవమన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!