దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది. అయితే, గత 9 రోజులుగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నది. ఇక ఇదిలా ఉంటె, కరోనాతో పాటుగా ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి ఇబ్బందులు పెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్ కనిపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణ సర్కార్ ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధిని నోటిఫియాబుల్ డిసీజ్ గా ప్రకటించింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల గురించి సమాచారం ఇవ్వాలని ప్రకటించింది. ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నది.