కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ.. ఏముందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండు కాంపోనెంట్లుగా (1.14 మరియు 1.15) గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచారు. అవి రెండూ ఒకే కాంపోనెంట్ గా పొందుపర్చాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే KRMB కి లేఖ రాసింది. గెజిట్ నోటిఫికేషన్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండవ కాంపోనెంట్ ను 25 టిఎంసీల నుండి 40 టిఎంసిల వరకు పెంచినదిగా చూపించారు. అది తప్పు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నాటి ఆంధ్ర ప్రదేశ్ కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుండి 3.65 లక్షల ఎకరాలకు పెంచింది కాని నీటి కేటాయింపులు ఆ మేరకు సరిపోయినంతగా పెంచలేదు.
తెలంగాణ ప్రభుత్వం ఆ పెంచిన ఆయకట్టుకు సరిపొయే నీటి కేటాయింపులు చేసింది తప్ప కొత్తగా ఆయకట్టును పెంచలేదు. కొత్త సోర్స్ నుండి నీటిని తిసుకొవడం లేదు అని తెలియజేయడం జరిగింది. ఆయకట్టు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను కూడా పేర్కొనడం జరిగింది. ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం శ్రీశైలం రిజర్వాయిర్ నుండి +800 అడుగుల వద్ద నీటిని తీసుకునే విధంగా 2006 లోనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట నివేదించిన DPR లోనే ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన GNSS, Veligonda, HNSS, TGP ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట నివేదిస్తూ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు FRL +885 అడుగుల వద్ద / FRL కు సమీప మట్టం వద్ద నీటిని తీసుకునేవిధంగా డిజైన్ చేసినట్టు తెలియజేశారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
కల్వకుర్తి క్రిష్ణా నది బేసిన్లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద, బేసిన్ ఆవలివి కాబట్టే ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తి రిజర్వాయర్ మట్టం 885 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్ చేశారు అని తెలంగాణ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కొనసాగుతున్న KWDT-II వద్ద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 75 శాతం విశ్వసనీయత గల నికర జలాలను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు కేటాయించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం GNSS, Veligonda, HNSS తదితర ప్రాజెక్టులకు మిగులు జలాల కేటాయింపు మాత్రమే కొరింది. 75 శాతం విశ్వసనీయత గల నికర జలాలు కేటాయించాలని కోరలేదు అని తెలంగాణ స్పష్టపరిచింది. ఈ కారణాల రీత్యా తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని, గజిట్ నోటిఫికేషన్ నుండి కల్వకుర్తి రెండవ భాగాన్ని 1.15 ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని KRMBని కోరడమైనది.. అని లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!