ట్రెండ్ సెట్టర్ సీఎం కేసీఆర్.. ఒకే నినాదంతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేం ట్రెండును ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం.. అంటూ ఓ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెబుతారు.. ఇది సరిగ్గా సరిపోయే వ్యక్తం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావే.. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు జై భీమ్ నినాదం ఎత్తుకునేలా ఎత్తులు వేసి విజయం సాధించారు కేసీఆర్. జై భీమ్ నినాదం కొత్త కాదు.. కానీ, దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ జై భీమ్, జై తెలంగాణ అంటూ నినదించడం పెద్ద చర్చగా మారిపోయింది.
ఇక, కేసీఆర్ 2001లో తెలంగాణ నినాదం ఎత్తుకున్నప్పుడు అంతా రాజకీయ పబ్బం కొసం కొత్త వేదిక అనుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కూడా లైట్ తీసుకుంది తెలంగాణ ఉద్యమాన్ని… కాని కొద్ది రోజులకే అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని తమ ఎజెండాలో పెట్టుకునే దశకు తీసుకెళ్లారు ఉద్యమనేత కేసీఆర్. పార్టీలకతీతంగా నేతంలందరితో జై తెలంగాణ అనిపించారు. 24 గంటల ఉచిత కరెంట్ను అన్నప్పుడు ఇది అసాధ్యం అన్నవాళ్లే అంతా. అప్పుడున్న తెలంగాణ పరిస్థితి కూడా అలాంటిదే. కాని దాన్ని సుసాధ్యం చేస్తూ గత ఏడేళ్లుగా కరెంటు అందింస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరెంటు పేరుతో ఉధ్యమాలు జరిగిన తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ అంశం కరంట్ టాపిక్లో లేకుండా పోయింది. చాలా రాష్ట్రాలు విద్యుత్ విషయంలో కేసీఆర్ను ఫాలో అయ్యాయి.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
మరోవైపు దేశంలోనే సంచలనంగా మారిన రైతుబంధు పథకంలో ఖచ్చితంగా కేసీఆర్ ట్రెండ్ సెట్టర్. ఎకరాకు పదివేలు ఇవ్వడం సాధ్యంకాని పనంటూ కొట్టిపారేసిన వాళ్లంతా నోర్లు వెల్లబెట్టుకునేలా రైతు బంధు అమలుచేస్తున్నారు. అంతేకాదు రైతు బంధును అధ్యయనం చేసి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలే కాదు…ఏకంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు పెట్టుబడి సాయాన్ని అమలుచేస్తుంది. దళిత బంధు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన మరో సంచలన పథకమే… దళిత బంధు కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు ఇదొక ఉద్యమం అంటూ కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ జై భీమ్ అనడంతో అటు ప్రతిపక్షాలు కూడా ఆ నినాదాన్ని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ దళిత దండోరా ప్రకటించింది. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అదే ఎజెండాతో బీఎస్సీలో చేరారు. బీజేపీ కూడా దళిత సంక్షేమంపై అంశాల వారిగా ఎజెండా రూపొందించుకుంటుంది. ఇలా తెలంగాణలో రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని జై భీమ్ బాట పట్టించారు కేసీఆర్.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!