ట్రెండ్ సెట్టర్ సీఎం కేసీఆర్.. ఒకే నినాదంతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేం ట్రెండును ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం.. అంటూ ఓ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెబుతారు.. ఇది సరిగ్గా సరిపోయే వ్యక్తం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావే.. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు జై భీమ్ నినాదం ఎత్తుకునేలా ఎత్తులు వేసి విజయం సాధించారు కేసీఆర్. జై భీమ్ నినాదం కొత్త కాదు.. కానీ, దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ జై భీమ్, జై తెలంగాణ అంటూ నినదించడం పెద్ద చర్చగా మారిపోయింది.
ఇక, కేసీఆర్ 2001లో తెలంగాణ నినాదం ఎత్తుకున్నప్పుడు అంతా రాజకీయ పబ్బం కొసం కొత్త వేదిక అనుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కూడా లైట్ తీసుకుంది తెలంగాణ ఉద్యమాన్ని… కాని కొద్ది రోజులకే అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని తమ ఎజెండాలో పెట్టుకునే దశకు తీసుకెళ్లారు ఉద్యమనేత కేసీఆర్. పార్టీలకతీతంగా నేతంలందరితో జై తెలంగాణ అనిపించారు. 24 గంటల ఉచిత కరెంట్ను అన్నప్పుడు ఇది అసాధ్యం అన్నవాళ్లే అంతా. అప్పుడున్న తెలంగాణ పరిస్థితి కూడా అలాంటిదే. కాని దాన్ని సుసాధ్యం చేస్తూ గత ఏడేళ్లుగా కరెంటు అందింస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరెంటు పేరుతో ఉధ్యమాలు జరిగిన తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ అంశం కరంట్ టాపిక్లో లేకుండా పోయింది. చాలా రాష్ట్రాలు విద్యుత్ విషయంలో కేసీఆర్ను ఫాలో అయ్యాయి.
Also Read
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
మరోవైపు దేశంలోనే సంచలనంగా మారిన రైతుబంధు పథకంలో ఖచ్చితంగా కేసీఆర్ ట్రెండ్ సెట్టర్. ఎకరాకు పదివేలు ఇవ్వడం సాధ్యంకాని పనంటూ కొట్టిపారేసిన వాళ్లంతా నోర్లు వెల్లబెట్టుకునేలా రైతు బంధు అమలుచేస్తున్నారు. అంతేకాదు రైతు బంధును అధ్యయనం చేసి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలే కాదు…ఏకంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు పెట్టుబడి సాయాన్ని అమలుచేస్తుంది. దళిత బంధు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన మరో సంచలన పథకమే… దళిత బంధు కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు ఇదొక ఉద్యమం అంటూ కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ జై భీమ్ అనడంతో అటు ప్రతిపక్షాలు కూడా ఆ నినాదాన్ని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ దళిత దండోరా ప్రకటించింది. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అదే ఎజెండాతో బీఎస్సీలో చేరారు. బీజేపీ కూడా దళిత సంక్షేమంపై అంశాల వారిగా ఎజెండా రూపొందించుకుంటుంది. ఇలా తెలంగాణలో రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని జై భీమ్ బాట పట్టించారు కేసీఆర్.
తాజావార్తలు
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!