Cabinet: ముగుస్తున్న డెడ్లైన్… కేసీఆర్ కీలక నిర్ణయం..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు కొనబోమని గతంలోనే ప్రకటించింది కేసీఆర్ సర్కార్. అయితే రాష్ట్రంలో సమస్య తీవ్రం కావడంతో… దానిపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
Read Also: Pawan Kalyan: జనసేనాని రైతు భరోసా యాత్ర.. కౌలు రైతు కుటుంబాలకు పరామర్శ..
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
యాసంగి వడ్లు కొనాల్సిందేనంటూ… నిన్న ఢిల్లీలో ఆందోళన చేసింది టీఆర్ఎస్. కేంద్రానికి 24గంటల టైమ్ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ మధ్యాహ్నంతో ఆ గడువు ముగియనుంది. దీంతో కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తి ఏర్పడింది. కేంద్రం నుంచి కొత్తగా స్పందన వచ్చే అవకాశం కనిపించడంలేదు. యాసంగిలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాల్సి వస్తుందని అంచనా. రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేసి రా రైస్ గా మారిస్తే ఎంత నష్టం వస్తుంది. దాన్ని ఎలా భరించాలి. రైతుల దగ్గర వడ్లు కొని మిల్లర్లకు అమ్మడం ఇలాంటి అంశాలపై కేబినెట్ మీటింగ్లో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రం వడ్లు కొనకపోయినా… తెలంగాణ పేదరికంలో ఏమీ లేదని నిన్నటి సభలో కేసీఆర్ చెప్పారు. దీనిబట్టి చూస్తే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వడ్ల కొనుగోళ్లపై రాజకీయ, ప్రభుత్వ పోరాటాలకు తోడుగా న్యాయపరంగానూ పోరాడాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. పంజాబ్ తరహాలో వడ్లు కొనాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకే కొనుగోళ్ల విధానంపై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వడ్ల కొనుగోళ్లతో పాటు ఉద్యోగాల భర్తీ, రెండో దశ ఆర్థిక శాఖ అనుమతుల జారీ, నోటిఫికేషన్లకు అనుమతులు లాంటి అంశాలు కూడా కేబినెట్ మీటింగ్లో చర్చకు రానున్నాయి. అలాగే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల ఎత్తివేతపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..