జగన్ బర్త్ డే నాడు రక్తం పీల్చే కార్యక్రమం.. అచ్చెన్న ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ తన పుట్టిన రోజున పేదల రక్తాన్ని పీల్చే కార్యక్రమం ప్రారంభించారని దుయ్యబట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ నోటి వెంట అమ్మడం అనే పేరు తప్ప ఇంకో మాట రావడం లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం వరకు ఇచ్చిన ఇళ్లపై జగన్ ఇప్పుడు భారం మోపుతున్నారు. సీఎం జగన్ తన పుట్టిన రోజు OTS అనే ఒక దుర్మార్గమైన కార్యక్రమం మొదలు పెట్టారు.
అసలు OTSపై సీఎం జగనుకేం హక్కు ఉంది. 5 ఏళ్లలో 32 లక్షల ఇళ్ళు కడతాం అని చెప్పిన జగన్.. 30 నెలల్లో జగన్ ఒక్క ఇల్లు ఐన కట్టారా..? 2014-2019 మధ్య టీడీపీ హయాంలో 7.52 లక్షల ఇళ్ళు కట్టింది వాస్తవం కాదా..? జగన్ ఇచ్చే ఇంటి పట్టా చెల్లుబాటు కాదు. 5 వేల కోట్ల దోపిడీ కోసమే OTS కార్యక్రమం చేపట్టారని విమర్శించారు అచ్చెన్నాయుడు.
Also Read
పేదల ఇళ్లకు 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం అవుతుందన్నారు. కానీ ఇప్పటికి కేవలం 5.43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఉపయోగించారన్నారు. ఎప్పుడు 32 లక్షల ఇళ్లు కడతారు..? ఎలా కడతారు..?చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.చివరికి పుట్టిన రోజున కూడా జగన్ నిజం మాట్లాడలేదు.
పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా ఓటీఎస్ చేయాలి.టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసిస్తాం.ఓటీఎస్ కట్టకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు.. ఇది దారుణం.నీ పాలన బాలేదని సొంత పార్టీ వాళ్ళు చెప్పినా దాడులు చేస్తున్నారు. దాడి చేసిన గుప్తాను పిచ్చివాడు అన్నారు.. ఇప్పుడు మంత్రి పిలిచి కేక్ పెట్టారు. వైసీపీ పాలన దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని జనం ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!