తండ్రికి తగ్గ తనయుడు … సన్నీ డియోల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ చిత్రసీమకు త్రిమూర్తులుగా వెలిగారు దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్. వారి తరువాతి తరం హీరోల్లో మేచో మేన్ గా జేజేలు అందుకున్నారు ధర్మేంద్ర. ఆయన నటవారసుడుగా సన్నీ డియోల్ సైతం విజయపథంలో పయనించారు. సన్నీ డియోల్ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. 2019లో గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ టిక్కెట్ పై ఎంపీగా గెలుపొందారు.
ధర్మేంద్ర, ఆయన మొదటి భార్య ప్రకాశ్ కౌర్ తొలి సంతానంగా 1956 అక్టోబర్ 19న సన్నీ డియోల్ జన్మించారు. ఆ రోజుల్లో ధర్మేంద్ర టాప్ హీరోగా సాగారు. చిన్నప్పటి నుంచీ తండ్రిని చూస్తూ పెరిగిన సన్నీ డియోల్ కు సైతం సినిమాల్లో నటించాలన్న అభిలాష సహజంగానే కలిగింది. దాంతో 1983లో ‘బేతాబ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు సన్నీ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో కృష్ణ తనయుడు రమేశ్ హీరోగా ‘సామ్రాట్’ పేరుతో రూపొందింది. సన్నీ నటించిన ‘అర్జున్’ సైతం విజయకేతనం ఎగురవేసింది. ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘భారతంలో అర్జునుడు’గా తెరకెక్కింది. తండ్రి ధర్మేంద్రతో కలసి ‘సుల్తానత్’లో నటించారు సన్నీ. “యతీమ్, త్రిదేవ్, చాల్ బాజ్, నిగాహే, క్రోధ్” వంటి చిత్రాలలో అలరించారు సన్నీ. ఆ తరువాత తమ సొంత చిత్రం ‘ఘాయల్’తో అదిరిపోయే హిట్ పట్టేశారు. “నరసింహా, విశ్వాత్మ, దామినీ, డర్, అంగరక్షక్, జిద్దీ, బోర్డర్” చిత్రాలలోనూ సన్నీ నటన ఆకట్టుకుంది. ‘దిల్లగీ’ సినిమాతో డైరెక్టర్ గానూ మారారు. ఇందులో తన తమ్ముడు బాబీ డియోల్ తో కలసి నటించారు. 2001లో విడుదలైన ‘గదర్ -ఏక్ ప్రేమ్ కథ’ ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలచింది. ఈ బంపర్ హిట్ తరువాత మళ్ళీ సన్నీ డియోల్ కు ఆ స్థాయి సక్సెస్ లభించలేదు. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘గదర్ – ఏక్ ప్రేమ కథ -2’ తెరకెక్కనుందని ఇటీవల సన్నీ డియోల్ తెలిపారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
సన్నీ డియోల్ 1984లో పూజా డియోల్ ను పెళ్ళాడారు. ఆమెను లిండా డియోల్ అనీ పిలుస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు – కరణ్, రాజ్ వీర్. ‘యమ్లా పగ్లా దీవానా-2’ చిత్రంలో తండ్రి ధర్మేంద్ర, తమ్ముడు బాబీ డియోల్ తో కలసి నటించారు సన్నీ. ఈ చిత్రానికి ఆయన తనయుడు కరణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. మరి రాబోయే ‘గదర్’ సీక్వెల్ లో సన్నీ డియోల్ ఏ తీరున అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!