తండ్రికి తగ్గ తనయుడు … సన్నీ డియోల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ చిత్రసీమకు త్రిమూర్తులుగా వెలిగారు దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్. వారి తరువాతి తరం హీరోల్లో మేచో మేన్ గా జేజేలు అందుకున్నారు ధర్మేంద్ర. ఆయన నటవారసుడుగా సన్నీ డియోల్ సైతం విజయపథంలో పయనించారు. సన్నీ డియోల్ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. 2019లో గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ టిక్కెట్ పై ఎంపీగా గెలుపొందారు.
ధర్మేంద్ర, ఆయన మొదటి భార్య ప్రకాశ్ కౌర్ తొలి సంతానంగా 1956 అక్టోబర్ 19న సన్నీ డియోల్ జన్మించారు. ఆ రోజుల్లో ధర్మేంద్ర టాప్ హీరోగా సాగారు. చిన్నప్పటి నుంచీ తండ్రిని చూస్తూ పెరిగిన సన్నీ డియోల్ కు సైతం సినిమాల్లో నటించాలన్న అభిలాష సహజంగానే కలిగింది. దాంతో 1983లో ‘బేతాబ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు సన్నీ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో కృష్ణ తనయుడు రమేశ్ హీరోగా ‘సామ్రాట్’ పేరుతో రూపొందింది. సన్నీ నటించిన ‘అర్జున్’ సైతం విజయకేతనం ఎగురవేసింది. ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘భారతంలో అర్జునుడు’గా తెరకెక్కింది. తండ్రి ధర్మేంద్రతో కలసి ‘సుల్తానత్’లో నటించారు సన్నీ. “యతీమ్, త్రిదేవ్, చాల్ బాజ్, నిగాహే, క్రోధ్” వంటి చిత్రాలలో అలరించారు సన్నీ. ఆ తరువాత తమ సొంత చిత్రం ‘ఘాయల్’తో అదిరిపోయే హిట్ పట్టేశారు. “నరసింహా, విశ్వాత్మ, దామినీ, డర్, అంగరక్షక్, జిద్దీ, బోర్డర్” చిత్రాలలోనూ సన్నీ నటన ఆకట్టుకుంది. ‘దిల్లగీ’ సినిమాతో డైరెక్టర్ గానూ మారారు. ఇందులో తన తమ్ముడు బాబీ డియోల్ తో కలసి నటించారు. 2001లో విడుదలైన ‘గదర్ -ఏక్ ప్రేమ్ కథ’ ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలచింది. ఈ బంపర్ హిట్ తరువాత మళ్ళీ సన్నీ డియోల్ కు ఆ స్థాయి సక్సెస్ లభించలేదు. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘గదర్ – ఏక్ ప్రేమ కథ -2’ తెరకెక్కనుందని ఇటీవల సన్నీ డియోల్ తెలిపారు.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
సన్నీ డియోల్ 1984లో పూజా డియోల్ ను పెళ్ళాడారు. ఆమెను లిండా డియోల్ అనీ పిలుస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు – కరణ్, రాజ్ వీర్. ‘యమ్లా పగ్లా దీవానా-2’ చిత్రంలో తండ్రి ధర్మేంద్ర, తమ్ముడు బాబీ డియోల్ తో కలసి నటించారు సన్నీ. ఈ చిత్రానికి ఆయన తనయుడు కరణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. మరి రాబోయే ‘గదర్’ సీక్వెల్ లో సన్నీ డియోల్ ఏ తీరున అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!