Vande Bharat train: వందేభారత్ రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి అరెస్ట్.. కారణం వింటే షాక్ అవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతి తక్కువ కాలంలోనే దేశంలో పాపులర్ అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి ఎక్కువైంది. రాళ్లదాడికి పాల్పడిన ఓ వ్యక్తిని రైల్వే భద్రతాదళం అరెస్టు చేసింది. భారతీయ రైల్వేల విస్తరణతో సెమీ హైస్పీడ్గా పరిగణించబడే వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 14 రూట్లలో నడుస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ మహారాష్ట్ర నుంచి ముంబై-పూణె-సోలాపూర్ మార్గంలో నడుస్తోంది. అలాగే ముంబై గాంధీనగర్, ముంబై షిర్డీ రైళ్లు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా బెంగళూరు రైల్వే సెక్షన్లోని మలూరు-టికల్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్పై ఎప్పుడూ రాళ్ల దాడి జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని రైల్వే భద్రతా దళం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. రాళ్లు రువ్వడానికి అతడు చెప్పిన కారణాన్ని విని భద్రతా బలగాలు ఖంగుతిన్నారు.
Also Read:Medico Preethi Case: ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: ప్రీతి తండ్రి
వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు రువ్వినందుకు 36 ఏళ్ల వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) అరెస్టు చేసింది. అతని పేరు అభిజిత్ అగర్వాల్. పోలీసులు అతడిని విచారించారు. ఈ విచారణలో వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు రువ్వాలని దేవుడి నుంచి తనకు ఆజ్ఞ వచ్చినంది చెప్పాడు. వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు రువ్వడం వల్ల నాకు ఆహారం అందుతోందని పేర్కొన్నాడు. నిందితుడిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153, 147 కింద కేసు నమోదు చేశారు. విచారణలో అతడు మానసిక రోగి అని తేలింది. అభిజిత్ అగర్వాల్ రైల్వే ట్రాక్ లేదా స్టేషన్లో నివసిస్తున్నారు. అతను అక్కడే తిని పడుకుంటాడు. కార్లపై రాళ్లు వేయమని దేవుడు ఆదేశించాడని అందుకే తాను రాళ్లు విసురుతున్నానని చెప్పాడు.
Also Read:Amit Shah: బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు వదులుకుంటుంది?
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి కారణంగా ఆర్పిఎఫ్ పెట్రోలింగ్ను పెంచింది. ఇన్స్పెక్టర్ ఎస్కే థాపాతో పాటు అతని బృందం సాధారణ దుస్తులలో రైలు పట్టాలపై గస్తీ తిరుగుతోంది. ఆ సమయంలో అభిజిత్ అగర్వాల్ పట్టాలపై నుండి రాళ్ళు తీయడం గమనించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు రువ్వేందుకు సిద్ధమయ్యాడు. రాళ్లు రువ్వడం ప్రారంభించకముందే పోలీసులు అతడిని పట్టుకున్నారు. మైసూర్-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్పై తాను ఎప్పుడూ రాళ్లు విసురుతానని నిందితుడు అభిజిత్ అగర్వాల్ అంగీకరించాడు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!