Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఆయన.. తాజాగా శశి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘నూరుసామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా విజయ్ ఆంటోనీ తన వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను రాబోయే రెండు మూడేళ్లలో చిత్ర పరిశ్రమను, అలాగే చెన్నై మహానగరాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఒక పల్లెటూరిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. రంగుల ప్రపంచం కంటే ప్రశాంతమైన సాధారణ జీవితం గడపడంపైనే తనకు ఎక్కువ ఆసక్తి ఉందని, కేవలం వృత్తిపరమైన కారణాల వల్లే ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నానని తెలిపారు. జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెన్కాసికి మారినట్లే, తాను కూడా పోల్లాచి వంటి ప్రశాంతమైన ప్రాంతంలో స్థిరపడాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే మారుమూల గ్రామాల్లో వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నట్లు, ‘నూరుసామి’ షూటింగ్ జరిగిన కల్లకురిచ్చి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నారు.
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
నగరాల్లోని మాల్స్, ఆడంబరాల కంటే పల్లెటూరిలోని స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ప్రశాంతత ఎంతో గొప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, మూడేళ్ల క్రితం కూతురి ఆకస్మిక మరణం విజయ్ ఆంటోనీని మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఈ వ్యక్తిగత విషాదం తర్వాతే ఆయన సినిమాల వేగాన్ని తగ్గించారు. వెండితెరపై ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ, జీవితంలో మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యమని గ్రహించి ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆ తర్వాత శాశ్వతంగా చిత్రసీమకు దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ నిర్ణయం అభిమానులను షాక్కు గురిచేస్తున్నా, మరోవైపు ఆయన ‘అప్పా కుట్టి’ అనే సరికొత్త ఎమోషనల్ డ్రామా సినిమాను కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాబోతున్న ‘నూరుసామి’ చిత్రం ఒక యదార్థ సంఘటన ఆధారంగా, రక్తం, చెమట, బంధాల నేపథ్యంలో సాగే ప్రయాణంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో స్వాసిక కథానాయికగా నటించగా, లిజోమోల్ జోస్, అజయ్ ధీషన్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!