Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వ గోధుమల కొనుగోలు వ్యూహం అట్టర్ ప్లాప్ కావడంతో.. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది. మార్కెట్లో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. జనం భారీ ధరలు చెల్లించి పిండి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే..
టార్గెట్ 10 లక్షలు.. కొన్నది కేవలం 8 శాతమే!
సింధ్ ప్రాంతంలో ఈ సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జూన్ 4 నాటికి ఆహార శాఖ కేవలం 79,835.66 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 8 శాతం కూడా పూర్తి కాలేదన్నమాట. రైతుల నుంచి ప్రభుత్వం గోధుమలు సేకరించలేకపోవడానికి గల కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కంటే బహిరంగ మార్కెట్ (ఓపెన్ మార్కెట్) లో వ్యాపారులు రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. దాంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాకుండా, నేరుగా ప్రైవేట్ వ్యాపారులకే తమ పంటను అమ్ముకున్నారు. ప్రభుత్వం 40 కిలోల గోధుమలకు 3,500 పాకిస్థానీ రూపాయల మద్దతు ధరను ప్రకటించి, సుమారు 3.32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్లాన్ చేసింది. కానీ మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది.
Also Read
- Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ప్రభుత్వ సేకరించిన నిల్వలు తక్కువగా ఉండటం, ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ (జమాఖోరీ) కి తెరలేపడంతో ఓపెన్ మార్కెట్లో గోధుమల ధరలు ఏకంగా 25 శాతం పెరిగాయి. కరాచీలో 100 కిలోల గోధుమల ధర ఏకంగా 11,100 పాకిస్థానీ రూపాయలకు చేరింది. పాకిస్థాన్లోని హైదరాబాద్లో 100 కిలోలకు 10,900 రూపాయలుగా పలుకుతోంది. ధరలను నియంత్రించడంలో సింధ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. రిటైల్ మార్కెట్లో కిలో గోధుమ పిండిని 135 నుంచి 140 పాకిస్థానీ రూపాయలకు విక్రయిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధర కేవలం 107 రూపాయలు మాత్రమే. ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధర కంటే దాదాపు 30 రూపాయలు అదనంగా అమ్మకందారులు వసూలు చేస్తున్నారు. ప్రముఖ పాకిస్థానీ పత్రిక ‘డాన్’ కథనం ప్రకారం.. సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా ఈ ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా మాట్లాడుతూ.. కొందరు పెద్ద వ్యాపారులు గోధుమలను అక్రమంగా నిల్వ ఉంచి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్పై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
- Tags
- Food Crisis
- Karachi
- Pakistan
- Sindh
తాజావార్తలు
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!