Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వ గోధుమల కొనుగోలు వ్యూహం అట్టర్ ప్లాప్ కావడంతో.. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది. మార్కెట్లో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. జనం భారీ ధరలు చెల్లించి పిండి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే..
టార్గెట్ 10 లక్షలు.. కొన్నది కేవలం 8 శాతమే!
సింధ్ ప్రాంతంలో ఈ సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జూన్ 4 నాటికి ఆహార శాఖ కేవలం 79,835.66 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. అంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 8 శాతం కూడా పూర్తి కాలేదన్నమాట. రైతుల నుంచి ప్రభుత్వం గోధుమలు సేకరించలేకపోవడానికి గల కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కంటే బహిరంగ మార్కెట్ (ఓపెన్ మార్కెట్) లో వ్యాపారులు రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. దాంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాకుండా, నేరుగా ప్రైవేట్ వ్యాపారులకే తమ పంటను అమ్ముకున్నారు. ప్రభుత్వం 40 కిలోల గోధుమలకు 3,500 పాకిస్థానీ రూపాయల మద్దతు ధరను ప్రకటించి, సుమారు 3.32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్లాన్ చేసింది. కానీ మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది.
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ప్రభుత్వ సేకరించిన నిల్వలు తక్కువగా ఉండటం, ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ (జమాఖోరీ) కి తెరలేపడంతో ఓపెన్ మార్కెట్లో గోధుమల ధరలు ఏకంగా 25 శాతం పెరిగాయి. కరాచీలో 100 కిలోల గోధుమల ధర ఏకంగా 11,100 పాకిస్థానీ రూపాయలకు చేరింది. పాకిస్థాన్లోని హైదరాబాద్లో 100 కిలోలకు 10,900 రూపాయలుగా పలుకుతోంది. ధరలను నియంత్రించడంలో సింధ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. రిటైల్ మార్కెట్లో కిలో గోధుమ పిండిని 135 నుంచి 140 పాకిస్థానీ రూపాయలకు విక్రయిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధర కేవలం 107 రూపాయలు మాత్రమే. ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధర కంటే దాదాపు 30 రూపాయలు అదనంగా అమ్మకందారులు వసూలు చేస్తున్నారు. ప్రముఖ పాకిస్థానీ పత్రిక ‘డాన్’ కథనం ప్రకారం.. సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా ఈ ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా మాట్లాడుతూ.. కొందరు పెద్ద వ్యాపారులు గోధుమలను అక్రమంగా నిల్వ ఉంచి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్పై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
- Tags
- Food Crisis
- Karachi
- Pakistan
- Sindh
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!