విమాన ప్రయాణం ఆషామాషీ కాదు. సురక్షితంగా ప్రయాణించడం ఎంతో అవసరం. అందునా విమానంలో వుండగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరో ఒకరు సాయంచేయాలి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి ముంబై వెళ్తున్న స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా నాగ్పూర్ విమానాశ్రాయంలో ఆగాల్సి వచ్చింది. విమానంలోని ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. విమానంలో ప్రయాణిస్తున్న మహిళ గర్భవతి.. ఆమె స్వల్ప అనారోగ్యానికి గురైంది. కళ్లుతిరిగి కింద పడిపోయింది. దీంతో ఆమెకు చికిత్స కోసం విమానాన్ని మధ్యలోనే కిందికి దించాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. ముంబై వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం గోరఖ్ఫూర్లో బయల్దేరింది. అందులో సిబ్బంది సహా సిబ్బంది సహా 182 ప్రయాణికులు ఉన్నారు. వారిలో మూడు నెలల గర్భవతి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయింది. కానీ విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని ఏటీసీని కోరారు. గర్భవతి అయిన ఆ మహిళకు వాంతులు, కళ్లు తిరడంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది.
నాగ్పూర్ విమానాశ్రయ సిబ్బంది ల్యాండింగ్కు అనుమతించారు. మధ్యాహ్నం 12.32 గంటలకు నాగ్పూర్లో విమానం అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాగ్పూర్లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిందా మహిళ. ఆలస్యంగా ఐదుగంటల తర్వాత విమానం ముంబైకి వెళ్ళింది.