తెలంగాణలో టీడీపీ ఒక పార్టీగా ఉండిపోతే చాలా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుగడ కష్టమైనచోట దుకాణం మూసేయడం కామన్. తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఇదే చేశాయి. కానీ.. ఆయన ఆలోచన వేరేలా ఉంది. ప్రజల్లో ఆదరణ తగ్గినా పార్టీని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో లేక.. ఒక మనిషి ఆఫీస్లో ఉంటే చాలని భావించారో ఏమో తాళం తీసి.. తాళం వేసే వారికి బాధ్యతలు అప్పగించారని టాక్ నడుస్తోంది. ఆ పార్టీ ఏంటో? ఎవరో.. ఈ స్టోరీలో చూద్దాం.
బక్కని ఎంపికపై టీడీపీలో చర్చ లేదు.. ఆశ్చర్యం లేదు!
Also Read
తెలంగాణలో టీడీపీ ఉందంటే ఉంది. ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నారంటే ఉన్నారంతే. ఈ మాటలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. ప్రజల్లో పార్టీకి పట్టు సడలిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ ఖాళీ అనే చెప్పాలి. రాష్ట్ర విభజన నాటి నుంచి మొన్నటి వరకు టీటీడీపీని నడిపించిన ఎల్ రమణే గుడ్బై చెప్పేశారు. టీడీపీతో ఉంటే.. అధ్యక్ష పదవి మాత్రమే చేతిలో ఉంటుంది. నాయకులకు రాజకీయాల్లో అదొక్కటే పరమావధి కాదు. ఎన్నికల్లో కొట్లాడాలి. గెలవాలి… అధికారం చేపట్టాలి.. పదవుల్లో ఉండాలి. వీటి కోసం వేచి వేచి చూసిన.. ఎల్ రమణ సైకిల్పై టీడీపీ లోడ్ ఎత్తలేమని భావించి.. కారులో ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎల్ రమణ ప్లేస్లో టీటీడీపీ చీఫ్గా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు వచ్చారు. సాధారణంగా చంద్రబాబు నిర్ణయాలపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఆశ్చర్యాలు వ్యక్తం అవుతాయి. కానీ.. బక్కని ఎంపిక విషయంలో అలాంటివి ఏమీ లేవంటే.. తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ముఖం చూసిన వాళ్లే లేరు
2018 ఎన్నికల్లో టీడీపీకి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిద్దరూ టాటా బైబై గుడ్బై అంటూ టీఆర్ఎస్ గూటిలోకి వెళ్లిపోయారు. ఇక GHMC ఎన్నికల్లో గుండు సున్నా. గతంలో జరిగిన GHMC ఎన్నికల్లో ఒక్కటైనా సీటు వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పటిష్ఠంగా కనిపిస్తున్నా.. ఆపాటి పటిష్టత టీడీపీలో లేదు. ఒకప్పుడు కార్యకర్తలు.. నాయకుల రాకపోకలతో కళకళలాడిన పార్టీ ఆఫీస్.. ఇప్పుడు ఎవరోస్తారా.. తాళం ఎవరు తీస్తారా అని ఎదురు చూడాల్సిన దుస్థితి.
కష్టమో.. నష్టమో టీ టీడీపీని కంటిన్యూ చేయాలనే ఆలోచన!
తెలంగాణలో ప్రతికూల వాతావరణం ఉన్న సమయంలో తెలుగుదేశం మనుగడ కష్టమే అన్నది పార్టీ వర్గాల మాట. ఇంకా ఎందుకు… దుకాణం మూసేయొచ్చగా అని వైరి పక్షాలు అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుంటాయి. కానీ.. కష్టమో.. నష్టమో తెలంగాణలో టీడీపీని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. అందుకే ఎల్ రమణ స్థానాన్ని బక్కని నర్సింహులతో భర్తీ చేశారని అనుకుంటున్నారు.
పార్టీని నడిపించేందుకు ఒక్కరు ఉంటే చాలా?
టీడీపీలోనే ఉన్న ఒకరిద్దరు ముఖ్య నాయకులను అధ్యక్ష పదవి చేపట్టాలని చంద్రబాబు కోరినా.. వారు నిరాకరించారట. దీంతో ఇంకెవరినో సారథిని చేసి.. రేపటి రోజున వారు అధ్యక్ష హోదాలో పార్టీని వీడి వెళ్లే అవకాశం ఎందుకు ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. బక్కని అయితే అవివాహితుడు… దళితుడు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని కొనసాగుతుండటంతో ఆయనవైపు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ తలుపులు తీసి.. ఆఫీస్లో ఒకరు కూర్చుంటే చాలు. టైమ్ వచ్చినప్పుడు చూద్దాం. వైరిపక్షాలు ఆశిస్తున్నట్టు దుకాణం మూసేయడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారట. పార్టీ బలోపేతం కన్నా.. ముందు తెలంగాణలో టీడీపీ అనేది ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలన్న దానికే ప్రాధాన్యం ఇచ్చారట. మరి.. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా బక్కని అడుగులు వేస్తారో.. రాజకీయ భవిష్యత్ కోసం మథన పడతారో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!