అందుబాటులో లేని ఎమ్మెల్యే.. అడ్డూ అదుపూ లేని ఛోటా నేతల అక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఎమ్మెల్యే కనపడుట లేదు… ఇది ఆ నియోజకవర్గ ప్రజల మాట. మొదటి సారి బంపర్ మెజారిటీతో గెలిచిన ఆయన, నియోజకవర్గంలో మరీ నల్లపూసై పోయారట. అనుచరుల్ని వాకబు చేస్తే సారు చాలా బిజీ అంటున్నారట.. ఎవరికీ దొరకని యువ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మరి?
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ …. యువ ఎమ్మెల్యే ..పలమనేరు నియోజకవర్గ చరిత్రలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి. తొలిసారి టికెట్ దక్కించుకుని, గత ఎన్నికలో దాదాపు నలభైవేలకు పైగా మెజారిటీతో మాజీ మంత్రి అమరనాధరెడ్డిపై గెలిచారు. 2014లో వైసీపీ నుండి అమర్నాథ్ రెడ్డి గెలిచినా… తరువాత కాలంలో తిరిగి సొంత గూడైన టిడిపిలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ఉన్న పార్టీలో విభేదాలు, అభివృద్ధి పెద్దగా జరగపోవడంతో గత ఎన్నికలలో ఆయనకు సీన్ రివర్స్ అయ్యింది. ఇదే సమయంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి అయినా, అత్యంత భారీ మెజారిటీతో వెంకటయ్య గౌడ్ ని గెలిపించారు నియోజకవర్గప్రజలు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
కానీ, ఎమ్మెల్యేకి రాజకీయ అనుభవం లేకపోవడంతో దీనినే అలుసుగా తీసుకుని పలమనేరులో ఛోటా మోటా నాయకులు రెచ్చిపోతున్నారని టాక్ ఓ రేంజ్ లో వినపడుతుంది. అది కాస్తా గత పంచాయతీ ఎన్నికల సమయంలో పీక్స్ కు చేరిందని స్ధానికులు చెబుతున్నారు …
ఎమ్మెల్యే నియోజక వర్గంలో కంటే సొంత వ్యాపారాల కోసం బెంగుళూరులో ఉంటున్నారట. దీంతో పార్టీలో ఎవరికి నచ్చివారు వ్యవహరిస్తున్నరనే మాటలు కేడర్ లో వినపడుతున్నాయి. మంత్రి అనుచరులు ఓ వర్గం గా.. ఎమ్మెల్యే అనుచరులు మరో వర్గంగా.. గతంలో టికెట్ ఆశించి భంగపడినా నేతలు మరో వర్గం ఉంటున్నారట. దీంతో కేడర్ సైతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారట…. ఏదైనా పనికోసం అయినా, సమస్యలు పరిష్కారానికి ఈ మూడు వర్గాల్లో ఎవరిని కలవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారటా లోకల్ వైకాపా కేడర్.
ఇక ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో ఛోటా నేతలు… బెదిరింపులు… భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారనే టాక్ స్ధానికుల్లొ వినపడుతోంది… ఇవన్నీ ఎమ్మెల్యేకి చెబుదామన్న ఆయన అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు స్ధానికులు…
వారి అనుచరులను అడిగితే సార్ వెరి బిజీ అంటున్నారట… కరోనా సమయంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయని సమాచారం … మంత్రి పెద్దిరెడ్డి నియోజక వర్గానికి వచ్చినప్పుడు మాత్రం ఎమ్మెల్యే హడవిడి చేయడం తప్ప … సాధారణ సమయాల్లో ఆయన పెద్దగా కనపడటం లేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి… మాజీ మంత్రి అమరనాధరెడ్డిని పక్కన పెట్టి అవకాశం ఇస్తే.. ఆయన సొంత పనుల్లో ఆయన బిజీ ఉంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేశారని టాక్ జోరుగా నియోజకవర్గంలో సాగుతోంది …
తాజావార్తలు
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!