ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్న గుత్తా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ కోటాలో ఎమ్మెల్సీ అవుతామని అధికారపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుడు తన్నుకుపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే కోటాలో అయినా ఛాన్స్ ఉంటుందా? సొంత జిల్లా నుంచి ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఎవరాయన? లెట్స్ వాచ్!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యేది ఎవరో?
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేసింది అధికార పార్టీ. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన హుజురాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డిని ఎంపిక చేసింది. టీఆర్ఎస్లో చేరిన రోజుల వ్యవధిలోనే కౌశిక్రెడ్డికి గులాబీ శిబిరం ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీలో చర్చగా మారింది. వాస్తవానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై కొన్నాళ్లుగా టీఆర్ఎస్లో చాలా చర్చ జరుగుతోంది. ఎంతోమంది ఆశావహులు.. సీనియర్లు ఆశగా ప్రగతిభవన్ వైపు చూస్తున్నారు. వారెవరినీ కాదని కొత్తగా వచ్చిన వారు బూరెల బుట్టలో పడ్డారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలపై పడింది.
గవర్నర్ కోటాలో గుత్తాకు దక్కని ఎమ్మెల్సీ!
శాసనమండలి ఛైర్మన్గా పనిచేసిన గుత్తా సుఖేందర్రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి పంపుతారని అంతా అనుకున్నారు. ఇప్పుడు గుత్తాను కాదని వేరేవారికి అవకాశం ఇచ్చారు. మరి.. ఎమ్మెల్యే కోటాలోనైనా శాసనమండలికి పంపుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొన్ని లెక్కలు తీస్తున్నారు గులాబీ నేతలు. ఆ జిల్లాలో గుత్తాతోపాటు ఎమ్మెల్సీ కోసం లాబీయింగ్ చేస్తున్నవారు లేకపోలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు రెడ్డిలకు ఛాన్స్ ఇస్తారా?
నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో టీఆర్ఎస్ నేత కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని గులాబీ బాస్ ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్రెడ్డి, కోటిరెడ్డిలు ఒకే సామాజికవర్గం. ఒకే జిల్లా నుంచి ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తారా అన్నది ప్రశ్నే. ఇద్దరిలో ఒకరికి పదవిస్తే… రెండోవారి పరిస్థితి ఏంటన్న ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తే మాత్రం వేడి రాజుకుంటుంది. ఆ సమయానికి టీఆర్ఎస్లో ఎలాంటి సమీకరణాలు పైకి వస్తాయో తెలియదు. ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లు కాకుండా.. కొత్త వారిని అదృష్టం వరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీని దీనికి ఉదాహరణగా చెబుతూ .. టీఆర్ఎస్లో ఎవరూ ఓ అంచనాకు రాలేకపోతున్నారట.
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
-
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!