Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో ప్రేమజంటపై నడిరోడ్డుపై దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు చందు, శివస్నేహ రక్షణ కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. నవవధువు మెడలోని తాళిబొట్టు తెంచి, యువకుడిపై దాడికి దిగారు. భయంతో సమీప కార్యాలయంలో ఆశ్రయం పొందిన దంపతులను స్థానికులు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేయగా..పోలీసులు తమ కుటుంబ సభ్యులను అక్రమంగా తీసుకెళ్లారని చందు ఆరోపిస్తున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు రక్షణ కోసం ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా యువతి కుటుంబ సభ్యులు అడ్డగించి భౌతిక దాడులకు దిగారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు సమీపంలోని కార్యాలయంలోకి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు వారిని సురక్షితంగా ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కేకల దొడ్డిపల్లికి చెందిన శివస్నేహ, సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన చందు ఓ కోచింగ్ సెంటర్లో పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో జులై 19న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే, శివస్నేహ కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ పేరుతో రాయచోటి పోలీసులు తన కుటుంబ సభ్యులపై వేధింపులకు దిగుతున్నారని యువకుడు చందు తీవ్రంగా ఆరోపించాడు. 3 రోజుల క్రితమే తన తల్లి, పెద్దమ్మ, మేనమామలను పోలీసులు తీసుకెళ్లారని.. వారి ఆచూకీ కూడా తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు చందు. ఈ అన్యాయంపై జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలోనే యువతి బంధువులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పాడు.
దాడి సమయంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. యువతి కుటుంబ సభ్యులు నవవధువు మెడలోని తాళిబొట్టును తెంచివేసి, చందుపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ప్రశాంతంగా ఉండే ఎస్పీ ఆఫీస్ పరిసర ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన స్థానికులు, దంపతులకు ఆశ్రయం కల్పించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్లో నవవధువు శివస్నేహ స్టేట్మెంట్ను అధికారికంగా నమోదు చేసుకున్నారు. నవ దంపతులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన వివరాలను రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువ జంటలపై బంధువులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నవ దంపతులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ గుడ్బై!
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!