గరం గరం రాజకీయాలు నడిచే గన్నవరం టీడీపీలో కొత్త చర్చ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గరం గరం పాలిటిక్స్కు కేరాఫ్ అడ్రస్ అయిన గన్నవరంలో టీడీపీ కేడర్కు కష్టమొచ్చిందట. అక్కడ పార్టీ ఇంఛార్జ్ ఉన్నా.. కేడర్కు లీడర్ కొరత మాత్రం తీరలేదని టాక్. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని చర్చ జరుగుతోంది. ఈక్వేషన్లు కుదరడం లేదట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
గన్నవరం టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న బచ్చుల అర్జునుడు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఏపీలోని టీడీపీ కంచుకోట నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 వైసీపీ గాలిలోనూ ఇక్కడ టీడీపీ గెలిచింది. కృష్ణా జిల్లాలో రెండుచోట్ల టీడీపీ గెలవగా.. అందులో ఒకటి గన్నవరమే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జైకొట్టారు. దీంతో కేడర్ సైతం వంశీ, టీడీపీ వర్గాలుగా విడిపోయింది. అయినప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ బలంగానే ఉందని గుర్తించిన పార్టీ పెద్దలు బలమైన ఇంఛార్జ్ను పెట్టడానికి పెద్ద కసరత్తే చేసింది. చివరకు మచిలీపట్నానికి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని టీడీపీ ఇంఛార్జ్ను చేశారు.
గన్నవరానికి టీడీపీ ఇంఛార్జ్గా బచ్చుల సరిపోరని పార్టీలో టాక్!
ఎమ్మెల్యే వంశీ.. వైసీపీకి దగ్గరైన తర్వాత చానాళ్లపాటు గన్నవరానికి ఇంచార్జ్ను ప్రకటించలేదు టీడీపీ. ఇప్పుడున్న ఇంఛార్జ్ అర్జునుడు స్థానికుడు కాకపోయినప్పటికీ.. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఓకే చెప్పారు. బీసీ నేత కావడంతో వర్కవుట్ అవుతుందని అనుకున్నారట. కానీ.. అర్జునుడు వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. కేడర్ను కలుపుకొని వెళ్లలేకపోతున్నట్టు టాక్. చివరకు ఆయన గన్నవరానికి సరిపోరనే చర్చ పార్టీ వర్గాల్లోనే మొదలైందట.
ఎమ్మెల్యే వంశీపై విమర్శలు చేయలేకపోతున్నారా?
ఆర్థికంగా గన్నవరానికి బచ్చుల సరిపోరని ప్రచారం!
బచ్చుల కేవలం బీసీ నేతగా అధిష్ఠానం ఆదేశాలతో గన్నవరానికి వచ్చారు. ఇక్కడ గెస్ట్ అప్పీరియన్స్ తప్ప సీరియస్గా నియోజవర్గంపై ఫోకస్ పెట్టడం లేదట. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీపై బచ్చుల ఎక్కడా విమర్శలు కూడా చేయలేకపోతున్నట్టు తమ్ముళ్ల వాదన. కేవలం పేరుకే ఇన్చార్జిగా వ్యవహరిస్తూ డేత్డేలు. .బర్త్డేలకు మాత్రమే పరిమితం అవుతున్నారట. పార్టీ బలోపేతం, క్యాడర్ కోసం ఏమీ చేయటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికంగా కూడా బచ్చుల అర్జునుడు గన్నవరానికి సరిపోరనేది నియోజకవర్గ టీడీపీ నేతల అభిప్రాయమట.
వంశీని ఎదుర్కోవాలంటే బలమైన వ్యక్తి కావాలని ప్రచారం!
గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన దాసరి బాలవర్థనరావు, వంశీమోహన్లు ఆర్థికంగా బలంగా ఉండటంతోపాటు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా స్ట్రాంగ్ హోల్డ్ సంపాందించారనే ప్రచారం ఉంది. బచ్చులకు అవి సాధ్యం కాబోవని.. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిందట కేడర్. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో బలంగా ఉన్న వంశీని ఎదుర్కోవాలంటే బలమైన వ్యక్తిని పార్టీ ఇంఛార్జ్గా పెట్టాలని క్యాడర్ కోరుతోందట. మరి తెలుగు తమ్ముళ్ల వినతులపై టీడీపీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!