విజృంభించిన భారత బౌలర్లు.. దక్షిణాఫ్రికా 197 ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో సఫారీల జట్టు 197 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును బవుమా కాపాడాడు. బవుమా ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. బవుమా (52), డికాక్ (34) రాణించారు. బౌలర్ రబాడ బ్యాట్తోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ చివర్లో అతడు 25 పరుగులు చేశాడు.
Read Also: తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు భారత్ ఆలౌట్
Also Read
- Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
- Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
- Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు
- UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
భారత బౌలర్లలో మహ్మద్ షమీకి 5 వికెట్లు పడ్డాయి. షమీ 16 ఓవర్లు బౌలింగ్ వేసి 44 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. బుమ్రా 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లతో రాణించారు. మహ్మద్ సిరాజ్కు ఓ వికెట్ దక్కింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో గాయపడి మైదానం వీడిన బుమ్రా దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయిన తర్వాత మళ్లీ వచ్చి ఓ వికెట్ తీశాడు. కాగా టీమిండియాకు 130 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం నైట్ వాచ్మన్ శార్దూల్ (4), కేఎల్ రాహుల్ (5) క్రీజులో ఉన్నారు. భారత్ 146 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తాజావార్తలు
-
BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
-
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
-
Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
-
PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
-
Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!