Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Setback For Opposition In Supreme Court Over Misuse Of Central Agencies

Setback For Opposition: కేంద్ర సంస్థల దుర్వినియోగంపై విపక్షాలకు ఎదురుదెబ్బ

Published Date :April 5, 2023 , 4:47 pm
By NTV WebDesk
Setback For Opposition: కేంద్ర సంస్థల దుర్వినియోగంపై విపక్షాలకు ఎదురుదెబ్బ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నమోదు చేసిన కేసుల సంఖ్యలో విపరీతంగా పెరిగిందని ప్రతిపక్ష పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారని తెలిపారు.

Also Read:Uppena Remake: దళపతి విజయ్ కొడుకుతో సేతుపతి సిద్ధం…
గత దశాబ్దంలో కంటే గత ఏడేళ్లలో ఈడీ 6 రెట్లు ఎక్కువ కేసులు నమోదు చేసిందన్నారు. అయితే కేవలం 23 శాతం మాత్రమే నేరారోపణలు ఉన్నాయని సింఘ్వీ గణాంకాలను ఉదహరించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో 95 శాతం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని, ఇది రాజకీయ పగ, పక్షపాతానికి స్పష్టమైన నిదర్శనమని ఆరోపించారు.

అయితే, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ పిటిషన్ చెల్లుబాటు, సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ, ప్రాసిక్యూషన్ నుండి ప్రతిపక్ష పార్టీలకు మినహాయింపును కోరుతున్నారా ? పౌరులుగా వారికి ఏదైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా? అని సింఘ్వీని అడిగారు. తాను ప్రతిపక్ష నేతలకు ఎలాంటి రక్షణ లేదా మినహాయింపు కోరడం లేదని, చట్టాన్ని న్యాయమైన, నిష్పక్షపాతంగా వర్తింపజేయడం కోసమేనని సింఘ్వీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం తమ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు విఘాతం కలిగిస్తోందన్నారు. నిందితులను అరెస్టు చేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పలువురు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని, ఇది ప్రజాప్రతినిధులుగా విధులు నిర్వర్తించే వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.

Also Read:Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. అప్పులు సహజం..!
అయితే, సింఘ్వీ వాదనలను ప్రధాన న్యాయమూర్తి తొసిపుచ్చారు. ఈ పిటిషన్ తప్పనిసరిగా రాజకీయ నాయకుల కోసం ఒక విజ్ఞప్తి అని అన్నారు. అవినీతి లేదా నేరపూరితంగా ప్రభావితమయ్యే ఇతర పౌరుల హక్కులు, ప్రయోజనాలను పిటిషన్ పరిగణనలోకి తీసుకోలేదని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. కేవలం రాజకీయ నాయకుల కోసం సుప్రీంకోర్టు సాధారణ మార్గదర్శకాలు లేదా సూత్రాలను నిర్దేశించలేదని, వ్యక్తిగత కేసులను కోర్టు ముందుంచడం మరింత సముచితమని ఆయన అన్నారు. సింఘ్వీ తన ఆందోళనలను పార్లమెంటులో లేవనెత్తవచ్చని కూడా ఆయన సూచించారు. రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ పిటిషన్​ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని విపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు. ఇందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Manu Singhvi
  • CBI
  • ED
  • Modi's government
  • Opposition Parties

తాజావార్తలు

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!

  • RCB Legend: “నువ్వు దేవుడు సామీ”.. 2008 నుంచి 2026 వరకు 18 ఏళ్లుగా ఒకే టీమ్‌ను నమ్ముకున్న ఏకైక ప్లేయర్..

  • Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. ఇక పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి!

  • PK Vs RS : పవన్ కళ్యాణ్ Vs రణవీర్ సింగ్.. బాక్సాఫీస్ వద్ద ‘హ్యాట్రిక్’ క్లాష్!

  • AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల.. 10060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్స్ లిస్ట్ ఇదే!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions