Different Amit Shah: భిన్నమైన అమిత్ షాని చూశాం.. ముస్లిం నేతల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కొత్త చూస్తున్నామని కొందరు ముస్లిం నేతలు ప్రసంశలు కురిపించారు. ముస్లిం మత పెద్దల ప్రతినిధి బృందం నిన్న అర్థరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుంది. శ్రీరామనవమి తర్వాత మతపరమైన హింస, ద్వేషపూరిత ప్రసంగాలపై చర్చించారు. ప్రతినిధి బృందానికి జమియత్ ఉలమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ, కార్యదర్శి నియాజ్ ఫరూఖీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కమల్ ఫరూఖీ, ప్రొఫెసర్ అక్తరుల్ వాసే నాయకత్వం వహించారు.
Also Read:Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. అప్పులు సహజం..!
దేశం ఎదుర్కొంటున్న 14 సవాళ్లను ప్రతినిధి బృందం లేవనెత్తిందని నియాజ్ ఫరూఖీ తెలిపారు. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మత హింసాత్మక ఘటనలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇది అమిత్ షా రాజకీయ ప్రసంగాల కంటే భిన్నంగా కనిపించారని చెప్పారు. కేంద్ర హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, ఆయన తాము చెప్పింది పూర్తిగా విన్నారని పేర్కొన్నారు. బీహార్లోని నలందలో మదర్సాకు నిప్పంటించిన ఘటనను కూడా ముస్లిం నేతలు లేవనెత్తారని ఫరూఖీ తెలిపారు. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను కూడా తాము లేవనెత్తామని ముస్లిం నేత చెప్పారు. మీ పక్షాన మౌనం ముస్లింలలో నిరాశకు దారితీస్తుందని తాము అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన దానిని పరిశీలిస్తానని చెప్పారని ఫరూకి వెల్లడించారు. మేము ఏ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదన్నారు. దేశంలో వాతావరణాన్ని మార్చడం తమ లక్ష్యం అని చెప్పారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
Also Read:Minister KTR: పేపర్ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్ ఫైర్
రామనవమి ఊరేగింపుల సందర్భంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. తమ ర్యాలీలపై దాడి జరిగిందని బీజేపీ ఆరోపిస్తుండగా, రాజకీయ ప్రయోజనాల కోసం హింసకు పాల్పడింది బీజేపీయేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజస్థాన్లోని భరత్పూర్ నివాసితులు జునైద్, నసీర్ల హత్యపై కూడా చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 15న నసీర్ (25), జునైద్ (35)లను గోసంరక్షకులు అపహరించారు. మరుసటి రోజు ఉదయం హర్యానాలోని భివానీలో వారి మృతదేహాలు కాలిపోయిన కారులో కనిపించాయి. హోం మంత్రితో సమావేశం తర్వాత ముస్లిం ప్రతినిధి బృందం ఎంత సంతృప్తి చెందింది.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!