వైసీపీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం.. ఆ ఘనత జగన్దే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉంది.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో దేశంలో భిన్నత్వం ఉంటుంది.. అందరినీ ఒకే తాటిపై నడిపించే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు.. వర్ణ, కుల వివక్ష రూపుమాపటానికి బీజం వేసిన మహనీయులు అంబేద్కర్ అని గుర్తుచేసుకున్నారు.. ఇక, వైసీపీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉందని.. ఆ ఘనత సీఎం జగన్దే అన్నారు.
Read Also: ఓటు వేయకపోతే రూ.350 ఫైన్..! క్లారిటీ ఇచ్చిన ఈసీ
Also Read
ఇక, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల సమానత్వం కోసం విశేష కృషి చేస్తున్న గొప్ప నేత వైఎస్ జగన్ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతఇళ్లు ఉండాలనే ఆకాంక్షతో మహిళల పేరు మీద రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే చెందుతుందన్నారు.. పేద వర్గాలకు ఒక ఆస్తి కల్పన జరుగుతోంది.. వైఎస్ హయాంలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఉండటానికి మినహాయించి ఇంటిపై హక్కులు లేని లక్షలాది మందిని ఆదుకునేందుకు చేస్తున్న యత్నం ప్రారంభమైందన్నారు. అంబేద్కర్ కలలు సాకారం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని.. గతంలో తీసుకున్న ఇళ్లకు అసలు, వడ్డీ కలిపి నామమాత్రపు రుసుముతో 39 లక్షల ఇళ్లను వారిపేరు మీది రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మరోవైపు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైయస్.జగన్… కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె కనకారావు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!