Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ లో చల్లారని వేడి.. కీలక సమావేశానికి పైలట్ డుమ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు కలవర పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వివాదం ముదురుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో జైపూర్ శివార్లలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి గెహ్లాట్, పార్టీ ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ సింగ్ రంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గోవింద్ సింగ్ దోతస్రా ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Also Read: Today Stock Market Roundup 17-04-23: ఐటీసీ షేర్.. బెస్ట్ పెర్ఫార్మర్
ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ప్రాతినిధ్యం వహిస్తున్న టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఈ రోజు షెడ్యూల్ చేయబడింది. అయితే సోలో ఔట్రీచ్ ప్రోగ్రామ్లో ఉన్నందున పైలట్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీ సమావేశాలను షెడ్యూల్ చేయడానికి ముందే పైలట్ తన కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
గత కొద్ది రోజులుగా సచిన్ పైలట్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దీక్షలు చేపట్టడం సంచలనమైంది. వసుంధర రాజే నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై సచిన్ పైలట్ ఒక వారం క్రితం నిరసన దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి ఏమాత్రం సహించని విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ, వసుందరరాజే పాలనలో అవినీతిపై దర్యాప్తు చేయాలన్నారు. అవినీతిపై చర్యల తీసుకోవాలని సీఎం అశోగ్ గెహ్లాట్ ను డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ చేసిన దీక్షపై పార్టీ అధిష్టానం సైతం గుర్రుగా ఉంది. అయినా సచిన్ పైలట్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు.
Also Read:Today Stock Market Roundup 17-04-23: ఐటీసీ షేర్.. బెస్ట్ పెర్ఫార్మర్
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ చర్చలకు పైలట్ హాజరుకావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పైలట్ యొక్క కార్యక్రమం ముందుగా షెడ్యూల్ చేయబడినందున ఆయన గైర్హాజరు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వార్ రూమ్లో మాజీ మంత్రి రఘు శర్మ వ్యాఖ్యానించారు. అశోక్ గెహ్లాట్ సాంఘిక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!