Hardik Pandya: హార్దిక్ అరుదైన ఘనత.. రాజస్థాన్ చెత్త రికార్డ్.. తొలిసారి రివేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Creates Unique Record In IPL: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. రాయస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 19 బంతుల్లోనే 28 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్.. ఈ సందర్భంగా 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్లో 2000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 50 వికెట్లు పడగొట్టిన ఆరో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు ఈ ఫీట్ని ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ (3874 పరుగులు & 92 వికెట్లు), కైరన్ పొలార్డ్ (3412 పరుగులు & 69 వికెట్లు), రవీంద్ర జడేజా (2,531 పరుగులు & 138 వికెట్లు), జాక్స్ కాలిస్ (2,427 పరుగులు & 65 వికెట్లు), ఆండ్రూ రసెల్ (2,095 పరుగులు & 92 వికెట్లు) సాధించారు.
MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేటి విచారణ వాయిదా.. రేపు రావాలని సీబీఐ నోటీసులు
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇదిలావుండగా.. గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందించినప్పటికీ, ఒక చెత్త రికార్డ్ని తన పేరిట లిఖించుకుంది. పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి కేవలం 26 పరుగులే చేసిన ఈ జట్టు.. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యంత స్వల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అయితే.. గుజరాత్పై రాజస్థాన్కు ఇది మొట్టమొదటి విజయం. గత సీజన్లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడగా.. ఆ మూడు మ్యాచ్ల్లోనూ గుజరాత్ జట్టే గెలుపొందింది. ఇదే సమయంలో షిమ్రోన్ హెట్మేయర్ ఒక అరుదైన రికార్డ్ని కూడా నమోదు చేశాడు. మెరుపు హాఫ్ సెంచరీ చేసిన అతగాడు.. ఐపీఎల్లో ఐదో అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ (157.20) కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు (కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్లలో). ఈ విభాగంలో ఆండ్రూ రసెల్ (177.09) అగ్రస్థానంలో ఉన్నాడు.
Iftar party: గర్భవతి అయిన భార్యతో ఇలా ప్రవర్తిస్తాడా?.. నటి సనాఖాన్ భర్తపై నెటిజన్లు ఆగ్రహం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (46) పరుగులతో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచారు. ఇక 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకి మొదట్లోనే పెద్ద ఝలక్లు తగిలాయి. జైస్వాల్, బట్లర్ వెనువెంటనే ఔటయ్యారు. 10.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 55 పరుగులే చేయడంతో.. రాజస్థాన్ ఓటమి తథ్యమని అంతా అనుకున్నారు. అప్పుడు సంజూ(32 బంతుల్లో 60) , హెట్మేయర్స్ (26 బంతుల్లో 56 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో.. రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!