Hardik Pandya: హార్దిక్ అరుదైన ఘనత.. రాజస్థాన్ చెత్త రికార్డ్.. తొలిసారి రివేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Creates Unique Record In IPL: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. రాయస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 19 బంతుల్లోనే 28 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్.. ఈ సందర్భంగా 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్లో 2000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 50 వికెట్లు పడగొట్టిన ఆరో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు ఈ ఫీట్ని ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ (3874 పరుగులు & 92 వికెట్లు), కైరన్ పొలార్డ్ (3412 పరుగులు & 69 వికెట్లు), రవీంద్ర జడేజా (2,531 పరుగులు & 138 వికెట్లు), జాక్స్ కాలిస్ (2,427 పరుగులు & 65 వికెట్లు), ఆండ్రూ రసెల్ (2,095 పరుగులు & 92 వికెట్లు) సాధించారు.
MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేటి విచారణ వాయిదా.. రేపు రావాలని సీబీఐ నోటీసులు
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఇదిలావుండగా.. గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందించినప్పటికీ, ఒక చెత్త రికార్డ్ని తన పేరిట లిఖించుకుంది. పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి కేవలం 26 పరుగులే చేసిన ఈ జట్టు.. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యంత స్వల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అయితే.. గుజరాత్పై రాజస్థాన్కు ఇది మొట్టమొదటి విజయం. గత సీజన్లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడగా.. ఆ మూడు మ్యాచ్ల్లోనూ గుజరాత్ జట్టే గెలుపొందింది. ఇదే సమయంలో షిమ్రోన్ హెట్మేయర్ ఒక అరుదైన రికార్డ్ని కూడా నమోదు చేశాడు. మెరుపు హాఫ్ సెంచరీ చేసిన అతగాడు.. ఐపీఎల్లో ఐదో అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ (157.20) కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు (కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్లలో). ఈ విభాగంలో ఆండ్రూ రసెల్ (177.09) అగ్రస్థానంలో ఉన్నాడు.
Iftar party: గర్భవతి అయిన భార్యతో ఇలా ప్రవర్తిస్తాడా?.. నటి సనాఖాన్ భర్తపై నెటిజన్లు ఆగ్రహం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (46) పరుగులతో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచారు. ఇక 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకి మొదట్లోనే పెద్ద ఝలక్లు తగిలాయి. జైస్వాల్, బట్లర్ వెనువెంటనే ఔటయ్యారు. 10.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 55 పరుగులే చేయడంతో.. రాజస్థాన్ ఓటమి తథ్యమని అంతా అనుకున్నారు. అప్పుడు సంజూ(32 బంతుల్లో 60) , హెట్మేయర్స్ (26 బంతుల్లో 56 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో.. రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!