RamNavami Flag Desecration: జంషెడ్పూర్లో అల్లర్లు.. రంగంలో దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో రామనవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలపై గత రాత్రి రెండు గ్రూపులు ఘర్షణ పడటంతో అల్లర్ల నియంత్రణకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శాస్త్రినగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ రోజు ఉదయం అల్లర్ల నిరోధక పోలీసులు ఆ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు చీఫ్ ప్రభాత్ కుమార్ తెలిపారు. గుమిగూడిన వారిని ఇంటికి పంపించారు. మొత్తం ప్రాంతంలో బలగాలను మోహరించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంపెనీని మోహరించారు.
Also Read:Maharashtra: ప్రాణం తీసిన చెట్టు.. వృక్షం నేలకూలి ఏడుగురు దుర్మరణం
మరోవైపు అల్లర్ల ఘటనకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తూర్పు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ జాదవ్ తెలిపారు. తాము పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితిని తీసుకురావడానికి శాంతి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు పౌరుల నుంచి సహకరించాలని ఆమె కోరారు. తాము తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఇతర అల్లర్ల నిరోధక వనరులను శాంతిభద్రతలను కాపాడటానికి నియమించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read:Jail Restaurant: బెంగళూరులో సెంట్రల్ జైల్ రెస్టారెంట్.. ప్రత్యేక ఏంటో తెలుసా ?
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
పుకార్లను నమ్మవద్దని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అభ్యర్థించారు. ప్రజలకు ఏవైనా రెచ్చగొట్టే లేదా అసహ్యకరమైన సందేశాలు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శనివారం నుంచి స్థానిక సంస్థ సభ్యులు రామనవమి జెండాను అపవిత్రం చేసినట్లు గుర్తించడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. నిన్న రాత్రి మంటలు చెలరేగడంతో, పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో క్యాంప్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!