RamNavami Flag Desecration: జంషెడ్పూర్లో అల్లర్లు.. రంగంలో దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో రామనవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలపై గత రాత్రి రెండు గ్రూపులు ఘర్షణ పడటంతో అల్లర్ల నియంత్రణకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శాస్త్రినగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ రోజు ఉదయం అల్లర్ల నిరోధక పోలీసులు ఆ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు చీఫ్ ప్రభాత్ కుమార్ తెలిపారు. గుమిగూడిన వారిని ఇంటికి పంపించారు. మొత్తం ప్రాంతంలో బలగాలను మోహరించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంపెనీని మోహరించారు.
Also Read:Maharashtra: ప్రాణం తీసిన చెట్టు.. వృక్షం నేలకూలి ఏడుగురు దుర్మరణం
మరోవైపు అల్లర్ల ఘటనకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తూర్పు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ జాదవ్ తెలిపారు. తాము పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితిని తీసుకురావడానికి శాంతి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు పౌరుల నుంచి సహకరించాలని ఆమె కోరారు. తాము తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఇతర అల్లర్ల నిరోధక వనరులను శాంతిభద్రతలను కాపాడటానికి నియమించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read:Jail Restaurant: బెంగళూరులో సెంట్రల్ జైల్ రెస్టారెంట్.. ప్రత్యేక ఏంటో తెలుసా ?
Also Read
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
పుకార్లను నమ్మవద్దని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అభ్యర్థించారు. ప్రజలకు ఏవైనా రెచ్చగొట్టే లేదా అసహ్యకరమైన సందేశాలు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శనివారం నుంచి స్థానిక సంస్థ సభ్యులు రామనవమి జెండాను అపవిత్రం చేసినట్లు గుర్తించడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. నిన్న రాత్రి మంటలు చెలరేగడంతో, పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో క్యాంప్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!