రైతులకు ఎవరు ఏం చేశారో చర్చకు రెడీ.. రేవంత్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చకు మేము సిద్దం అన్నారు.
2014 నుండి వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్దం. తేదీ చెప్పండి … చర్చిద్దాం. కాంగ్రెస్ రైతుల గురించి ఆలోచన చేసిందా అని టీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ ఏం చేసిందో కేటీఆర్ కి తెలియదు. గుంటూరు, పూణెలలో ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయనకి తెలియదు. 350 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసింది కాంగ్రెస్. నాణ్యమైన ఉచిత విద్యుత్ 7 గంటలు ఇచ్చింది కాంగ్రెస్. కనీస మద్దతు ధర ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది . అదనంగా బోనస్ ఇచ్చింది కాంగ్రెస్. మేము ఏం చేశామో చర్చకు సిద్దం తేదీ మీరే నిర్ణయించండి అన్నారు రేవంత్ రెడ్డి.
Also Read
2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో చర్చ కు సిద్దం. 2014 నుండి 2022 వరకు కేసీఆర్ ఏం చేశారో చర్చ చేద్దాం. ఏబుల్ లీడర్ షిప్ అని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. మేము రైతు బజార్ లు తెస్తే… కెసిఆర్ ఊరూరా లిక్కర్ షాప్ లు తెచ్చారు. ఏడున్నర ఏళ్ళలో పేదల నుండి 1లక్ష 50 వేల కోట్లు దోచారు. రైతు బంధు పేరుతో మీరు ఇచ్చింది 50 వేల కోట్లు అన్నారు రేవంత్.
తులసి వనం లెక్క ఉన్న తెలంగాణ నీ గంజాయి వనం లెక్క మార్చేశారు. ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తుంది. కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో ఎకరం కి కోటి రూపాయలు వస్తుంది అని చెప్పాడు. కేసిఆర్ ఫార్మ్ హౌస్ లో గంజాయి ఏమైనా పండిస్తున్నడా..? లాభ సాటి వ్యవసాయం చేస్తే.. కెసిఆర్ రైతుల్ని ఫార్మ్ కి తీసుకెళ్ళి అవగాహన కల్పించండి అన్నారు రేవంత్ రెడ్డి.
రైతు బీమా కింద లబ్ది పొందింది 70,500 మంది రైతులే. వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్క 75,014 మంది చనిపోయారు అని లేఖ రాసింది. మూడున్నర ఏళ్ళలో 75 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం తెలంగాణనే. మీ అధికారిక ప్రకటనే చెప్తుంది ఎన్ని రైతు బలిదానాలు జరిగాయి అనేది. చనిపోయిన రైతుల చావుల మీద చర్చ చేద్దామా..? రైతు బంధు సంబరాలు అంటా..? రైతు ప్రభుత్వం అయితే వెళ్దాం పద రైతుల దగ్గరికే. సిరిసిల్ల రైతు వేదికల్లో చర్చకు సిద్దం. ప్రగతి భవన్ లో అయినా చర్చకు సిద్దం. అమర వీరుల స్తూపం దగ్గర అయినా మేము రెడీ అని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.కేటీఆర్ సవాల్ చేస్తాడు. కోర్టుకి వెళ్తాడు. డ్రగ్స్ గురించి మాట్లాడితే కోర్టుకు పోయాడు. ఇప్పుడైనా వస్తావా చర్చకు. కేటీఆర్ ఒంట్లో తెలంగాణ రక్తమే ఉంటే చర్చకు రా రెచ్చగొట్టారు రేవంత్.
తాజావార్తలు
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్కు ముందే లాభాలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?