తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆచూకీ భీమవరంలో లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్ధినిని కిడ్నాపర్ భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వుంచాడని తేలింది. కిడ్నాపర్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయం అయ్యాడు భీమవరం మండలం కొత్త పూసలుమర్రుకి చెందిన ఫణీంద్ర.
లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని యువతిని నమ్మించాడు ఫణీంద్ర. ఆమెను భీమవరం బలుసుమూడి లో ఒక రూమ్ లో నిర్బంధించాడు. యువతి కాళ్ళు చేతులు కట్టేసి, చేతిపై కత్తి తో దాడి చేశాడు. ఆ వీడియో లు, ఫోటోలు యువతి తండ్రికి పంపి డబ్బులు డిమాండ్ చేశాడు ఫణీంద్ర. అమ్మాయిని నిర్బంధించిన రూం నుండి శబ్దాలు రావటంతో గమనించిన ఇంటి ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి ఓనర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగి యువతి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు భీమవరం టూ టౌన్ పోలీసులు. ఇద్దరిని రాజానాగరం పోలీసులకు అప్పగించనున్నారు భీమవరం టూ టౌన్ పోలీసులు.