కాంగ్రెస్ చివరి అస్త్రం ప్రయోగించబోతుందా?
గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత రెండు పర్యాయాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం క్రమంగా అన్ని రాష్ట్రాలపై పడింది. దీంతో కాంగ్రెస్ క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తుంది. ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారింది. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ సైతం ఛాలెంజ్ తీసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో అందరి చూపు ఈ ఎన్నికలపై పడింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుందనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.
త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి సైతం పరీక్షలా మారిపోయాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండగా వాటిని తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవశ్యకత ఆ పార్టీకి ఉంది. ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఓడినా ఆపార్టీపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను సైతం మార్చే సాహసం చేస్తుంది. ఇక కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలని నిర్ధారించే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ను రాజకీయ విశ్లేషకులు చూస్తుంటారు. దీనికి తగట్టుగానే అన్ని పార్టీలు ఇక్కడ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
ఉత్తరప్రదేశ్ లో జరిగిన గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అత్యధిక పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. దీంతో అందరి చూపు ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. బీజేపీ అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీకి ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ తిరిగి తన పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.
ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తన బ్రహ్మస్త్రంగా చెప్పుకుంటున్న ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో నిలుపుతోంది. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. తాజాగా ఆమె సారథ్యంలో కాంగ్రెస్ భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ప్రతిజ్ఙా యాత్ర పేరుతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా 12వేల కిలోమీటర్లు తిరగనున్నారు. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన ఆరంభం కానుందని సమాచారం. ఈ యాత్ర పేరుతో ప్రియాంకా గాంధీ ప్రతీ మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతుందని ఆపార్టీ ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈనేపథ్యంలో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కాంగ్రెస్ కు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కీలకంగా మారయనేది మాత్రం వాస్తవం. ఎన్నో ఆశలతో బరిలో దిగుతున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమేరకు సత్తాచాటుతుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
-
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
-
Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!