కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.. సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా అంతా రోశయ్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.
*రోశయ్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎంపీ టీజీ వెంకటేష్.. రోశయ్య అందరి వాడు… దేశంలో రాజకీయాలకు అతీతంగా అభిమానించే నేతల్లో రోశయ్య ఒకరు.. రోశయ్య మృతితో రాజకీయ ధృవతార రాలిపోయింది.. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా పేర్కొన్నారు.