ఆర్బీఐ కొత్త స్కీమ్ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్బీసీ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు కొత్త పథకాల కింద, పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్ను సులభంగా మరియు సురక్షితంగా యాక్సెస్ చేయగలరని అన్నారు.. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్తో పాటు రిజర్వ్ బ్యాంక్-ఇంటగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ను ఆవిష్కరించిన మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కస్టమర్ కేంద్రీకృతమైన ఈ రెండు కొత్త స్కీమ్ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందన్నారు. దీంతో మూలధన మార్కెట్ మరింత సులువు, సురక్షితం అవుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ కొత్త స్కీమ్లకు చిన్న ఇన్వెస్టర్లకు డైరెక్ట్ యాక్సిస్ ఉంటుందని వెల్లడించిన మోడీ.. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం బలమైన బ్యాకింగ్ వ్యవస్థ అవసరం అన్నారు.. సులభతరమైన పెట్టుబడులతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం కూడా చాలా కీలకమైన విషయంగా తెలిపిన ఆయన.. గడిచిన ఏడేళ్లలో ఎన్పీఏలను చాలా పారదర్శకంగా చూశామని, తీర్మానాలు.. రికవరీలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.
Read Also: సీఎస్, డిస్కంలు, ఇంధన శాఖకు ఏపీ ఈఆర్సీ లేఖ
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో బ్యాంకింగ్ రంగం అందించిన సేవలను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్బీఐతో పాటు వివిధ ఆర్థిక సంస్థలను కూడా ప్రశంసించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్తో, చిన్న పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలలో సురక్షితంగా పెట్టుబడి పెట్టగల మాధ్యమాన్ని కలిగి ఉన్నారన్న ఆయన.. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ పథకం దేశంలో ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్మన్ వ్యవస్థ’ రూపుదిద్దుకోవడానికి దోహదం చేస్తుందన్నారు.. 2014 నుండి తన ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలపై మాట్లాడిన ప్రధాని మోడీ.. తాను మొదటిసారి ప్రధాని అయినప్పుడు.. ఆర్థిక పునరుద్ధరణ, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గత ఏడేళ్లలో, నిరర్థక ఆస్తులను పారదర్శకతతో గుర్తించడంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు రీక్యాపిటలైజ్ చేయబడ్డాయి. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. దేశ అవసరాలు, పౌరుల అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ముందే ఉంటామన్నారు. మనం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిరంతరం బలోపేతం చేయాలి.. సున్నిత మరియు పెట్టుబడిదారుల-స్నేహపూర్వక గమ్యస్థానంగా భారతదేశం యొక్క కొత్త గుర్తింపును ఆర్బీఐ బలోపేతం చేయడం కొనసాగిస్తుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!