Opposition unity: ప్రధాని పదవి ఖాళీ లేదు.. మమత- నితీష్ భేటీపై బీజేపీ ఎద్దేవా
బీజేపీకి వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు కీలక నేతలతో భేటీలు అవుతున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ఆయన సమావేశం అయ్యారు. సోమవారం హౌరాలోని రాష్ట్ర సచివాలయం నబన్నాలో మమతా బెనర్జీని సీఎం నితీశ్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్ కలిశారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను కూడగట్టడానికి బీహార్ సిఎం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీంతో బీజేపీ తనదైన శైలిలో స్పందించింది.
Also Read: Ys Sunitha Political Entry Live: వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ?
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం కావడంపై బీజేపీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి ఖాళీ లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ మూడవ సారి తిరిగి రావడంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మహాకూటమిలో ప్రతిపక్షాలకు బలం చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలపై నితీష్ను ఎగతాళి చేస్తూ, “నితీష్ కుమార్ మా మద్దతు తీసుకుని సీఎం అయ్యారు. అతని పార్టీ మూడవ స్థానంలో ఉంది [బీహార్లో ఎమ్మెల్యేల పరంగా]. అతను దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నాడు. దేశంలో ప్రధాని పదవి ఖాళీ లేదని నితీష్ కుమార్ కు తెలుసు. అందుకే తాను అభ్యర్థిని కానని, ప్రతిపక్షాలను మాత్రమే ఏకం చేస్తున్నానని చెబుతున్నారు” అని ఎద్దేవా చేశారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో