టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి బంగారు పథకం వచ్చింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించాడు. అయితే ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో తొలి మెడల్ సాధించిన ఆటగాడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో ద్వారణం సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు నీరజ్. అయితే ఈ పథకం తో భారత్ ఖాతాలోకి మొత్తం 7 పథకాలు వచ్చాయి. అయితే ఒలింపిక్స్ లో భారత్ కు 7 పథకాలు రావడం ఇదే మొదటిసారి. గతంలో 2012 లో ఈ గేమ్స్ లో భారత్ కు అత్యధికంగా 6 వచ్చాయి. కానీ ఈసారి ఒక స్వర్ణం రెండు రజతాలు కాగా నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పథకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పథకాల పట్టికలో 47వ స్థానంలో ఉంది.