దీపావళి వేళ శుభవార్త.. ఈ రాష్ట్రాలన్నీ పెట్రో ధరలు తగ్గించాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో రోజురోజుకూ పైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలకు బ్రేక్లు వేయాలన్న ఉద్దేశంతో.. ఇప్పటికే లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలకు అడుగులు వేస్తూ.. వాహనదారులకు ఊరట కలిగించేలా.. తమ పరిధిలోని వ్యాట్ను తగ్గిస్తూ శుభవార్త వినిపించాయి.. కేంద్రం నిర్ణయం వెలువడిన రోజు కొన్ని రాష్ట్రాలు, మరుసటి రోజు మరికొన్ని రాష్ట్రాలు ఇలా.. అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లాంటి రాష్ట్రాలు వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి..
Read Also: నవంబర్ 5, శుక్రవారం దినఫలాలు…
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
ఇక, వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో ఒడిశా మినహా మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న స్టేట్సే కావడం గమనించిన దగిన పరిణామం.. ఇక, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర తగ్గించిందనే విషయాన్ని పరిశీలిస్తే.. అసోం పెట్రోల్, డీజిల్పై రూ. 7 చొప్పున తగ్గించగా.. త్రిపుర కూడా పెట్రోల్, డీజిల్పై రూ.7 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, కర్ణాటక సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గోవా ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై రూ.7చొప్పున వ్యాట్ను కుదించింది.. బీహార్ ప్రభుత్వం పెట్రోల్పై రూ.1.30, డీజిల్పై రూ.1.90 చొప్పున కోత విధించగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.2 వ్యాట్ను తగ్గించింది.. డీజిల్పై మాత్రం వ్యాట్ తగ్గించలేదు.. మరోవైపు పెట్రోల్, డీజిల్పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్టు మణిపూర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. యూపీ ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించడంతో.. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రూ.12 మేర దిగివచ్చాయి. మరో బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ కూడా పెట్రోల్, డీజిల్పై రూ.7చొప్పున కోత పెట్టింది.. ఇక, ఒడిశా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై రూ.3మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తగ్గించిన ధరలు అమల్లోకి రాగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!