దీపావళి వేళ శుభవార్త.. ఈ రాష్ట్రాలన్నీ పెట్రో ధరలు తగ్గించాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో రోజురోజుకూ పైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలకు బ్రేక్లు వేయాలన్న ఉద్దేశంతో.. ఇప్పటికే లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలకు అడుగులు వేస్తూ.. వాహనదారులకు ఊరట కలిగించేలా.. తమ పరిధిలోని వ్యాట్ను తగ్గిస్తూ శుభవార్త వినిపించాయి.. కేంద్రం నిర్ణయం వెలువడిన రోజు కొన్ని రాష్ట్రాలు, మరుసటి రోజు మరికొన్ని రాష్ట్రాలు ఇలా.. అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లాంటి రాష్ట్రాలు వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి..
Read Also: నవంబర్ 5, శుక్రవారం దినఫలాలు…
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ఇక, వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో ఒడిశా మినహా మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న స్టేట్సే కావడం గమనించిన దగిన పరిణామం.. ఇక, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర తగ్గించిందనే విషయాన్ని పరిశీలిస్తే.. అసోం పెట్రోల్, డీజిల్పై రూ. 7 చొప్పున తగ్గించగా.. త్రిపుర కూడా పెట్రోల్, డీజిల్పై రూ.7 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, కర్ణాటక సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గోవా ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై రూ.7చొప్పున వ్యాట్ను కుదించింది.. బీహార్ ప్రభుత్వం పెట్రోల్పై రూ.1.30, డీజిల్పై రూ.1.90 చొప్పున కోత విధించగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.2 వ్యాట్ను తగ్గించింది.. డీజిల్పై మాత్రం వ్యాట్ తగ్గించలేదు.. మరోవైపు పెట్రోల్, డీజిల్పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్టు మణిపూర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. యూపీ ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించడంతో.. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రూ.12 మేర దిగివచ్చాయి. మరో బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ కూడా పెట్రోల్, డీజిల్పై రూ.7చొప్పున కోత పెట్టింది.. ఇక, ఒడిశా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై రూ.3మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తగ్గించిన ధరలు అమల్లోకి రాగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!