దమ్ముంటే కేసీఆర్ని టచ్ చేయండి.. మంత్రి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్కి సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బీజేపీ పాలితరాష్ట్రాల్లో రైతుబంధు ఉందా? అని ప్రశ్నించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణలో వ్యవసాయభూములకు భారీగా ధరలు వచ్చాయని, అదే టైంలో ఆంధ్రాలో ధరలు ఢమాల్ అన్నాయన్నారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మాట్లాడుతున్నారన్నారు.
దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి… మా దమ్ము ఏంటో చూపిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రేవంత్ బుడ్డారఖాన్… సంజయ్ మెంటల్… అర్వింద్ ఏమీ లేనోడు. మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్క వచ్చి కేసీఆర్ మీద మొరిగింది. అస్సాం నుంచి వచ్చి ఇంకొకడు మొరుగుతున్నాడు. వాళ్ళ రాష్ట్రంలో ఒక ఎకరం భూమి ధర రూ.2 లక్షలు లేదు. ఇక్కడ ధర ఎందుకు పెరిగింది అంటే… పుష్కలంగా నీళ్లు, పుష్కలమైన ఉచిత కరెంట్, రైతుబంధు వల్ల భూముల ధరలు పెరిగాయి.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
కేంద్రం సీరియస్గా ఉంది.. ఎప్పుడైనా కేసీఆర్ జైలుకు వెళ్ళొచ్చు : బండి
ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారు. బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా ? తెలంగాణ వాళ్ళు బీహార్, మదే ప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారా ? బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఇట్లా ఉంది. ఇద్దరు అబద్దాలకోర్లు మొరుగుతున్నారు. ఒక్కడికి నెత్తి మీద ఉన్నది. లోపల లేదు. నిజామాబాదోడికి నెత్తిమీద లేదు, లోపల కూడా లేదు. రైతుబంధు, సాగునీరు మీ పాలిత రాష్ట్రంలో ఇస్తున్నారా? నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. అర్వింద్, సంజయ్ రాజీనామా చేస్తారా ? సవాల్ స్వీకరించాలన్నారు ప్రశాంత్ రెడ్డి.
గెలిచిన 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని మాటతప్పిన సిగ్గులేనివాడు అర్వింద్. సిగ్గులేకుండా ఇంకా గ్రామాల్లో తిరుగుతున్నాడు. దేశ వ్యవసాయ మంత్రి పసుపుబోర్డు ఇవ్వాలని చెప్పిన వెంటనే బాయిల బండ కట్టుకొని చచ్చిపోవాలి. నేనైతే అదే పని చేస్తుంటి. ఆంబోతు లెక్క ఊర్ల మీద పడి అర్వింద్ తిరుగుతున్నడు. కేసీఆర్ ను జైళ్లో పెడతా అంటున్న వెధవల్లారా దమ్ముంటే విచారణ చేయండి. జైల్లో పెడతామని ఏడాది నుంచి మొరుగుతున్నారు. ఎవరి జైలు కు పొయిండ్రో గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ ను టచ్ చేసి చూడండి. ఏమైతదో చూడండి. ఇక నుంచి ఊరుకునేది లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!