తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతూ వుంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ వుంటారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తన దృష్టికి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల సంగారెడ్డి మున్సిపాలిటీకి 15 కోట్ల 30 లక్షలు మంజూరు చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు ప్రతి నెల 341 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు. ఇవాళ సంగారెడ్డి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు 6 కోట్ల 7 లక్షల రూపాయలతో భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్.సంగారెడ్డి పట్టణంలో రూ.650 కోట్ల నిధులతో మెడికల్ కాలేజీకి భూమి పూజ త్వరలోనే చేసుకుంటామన్నారు మంత్రి. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు మంత్రి కేటీఆర్. పాత జీవోలను అమలుచేసే విషయం పరిశీలిస్తాం అన్నారు. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు వారం రోజుల్లో 50 కోట్లు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.