మంత్రి కేటీఆర్ ను కలిసిన మలావత్ పూర్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.
పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి కేటీ రామారావుకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
మలావత్ పూర్ణ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన విద్యార్ధిని. ఎవరెస్టు శిఖరం అధిరోహించేనాటికి ఈమె నిజామాబాదు జిల్లాలోని తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు లక్ష్మీ, దేవదాస్ లు. వీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. హైదరాబాద్ కేంద్రంగా సాహస కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ ఈ విద్యార్థులు ఎవరెస్ట్ వెళ్లటానికి సహాయ సహకారాలు అందించింది. గతంలో నేపాల్లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పింది. పూర్ణ 13 ఏళ్ల 11 నెలల వయస్సులోనే ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. పూర్ణ అతి పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా చరిత్ర నెలకొల్పింది.
52 రోజులపాటు సాగిన వీరి యాత్ర మే 25, 2014 ఉదయం ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. ఊహించిన సమయంకన్నా ముందే ఎవరెస్టును అధిరోహించింది. ఈమెతో పాటు ఈ యాత్రలో మాలవత్ పూర్ణ ఎస్.ఆనంద్కుమార్ తో కలసి ఈ సాహసయాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు. వీరిద్దరూ మూడురంగుల జెండాను ఆ శిఖరంపై పాతి దేశభక్తి గీతం ఆలపించారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!